Ravindranath-Gayatri: చిక్కుల్లో పన్నీరు సెల్వం కొడుకు.. మహిళ దెబ్బకు ప్రమాదంలో ఎంపీ పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gayatri Devi Allegations On MP Ravindranath: తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం కొడుకు రవీంద్రనాథ్ తాజాగా కొత్తు చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయన ఎంపీ పోస్టు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఓ సామాన్య మహిళ ఆయనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలే అందుకు కారణం. తాను అన్నగా భావించిన వ్యక్తి తనపై ఆశపడ్డాడని, సహకరించకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆ మహిళ కుండబద్దలు కొట్టింది. అతనిపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సైతం చేసింది. ఆ మహిళ పేరు గాయత్రి దేవి. తానిచ్చిన ఫిర్యాదులో ఆమె ఏం పేర్కొన్నదంటే..
Cab Driver Extorts: ఫోన్లో ‘ఎఫైర్’ మాటలు విన్నాడు.. మహిళని బెదిరించి 22 లక్షలు దోచేశాడు
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
2014లో ఒక పెళ్లి సమయంలో తన కుటుంబానికి, పన్నీరు సెల్వం ఫ్యామిలీతో పరిచయం ఏర్పడినట్టు ఆమె తెలిపింది. క్రమంగా తమ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, దాంతో అందరం ఒకే కుటుంబం తరహాలో మెలిగే వాళ్లమని చెప్పింది. పన్నీరు సెల్వం తనయుడు అయిన రవీంద్రనాథ్ను తాను సొంత అన్నయ్యలాగా భావించానని, ఆ విధంగా అతనితో మెలిగానని పేర్కొంది. అయితే.. గతేడాది చివరి నుంచి రవీంద్రనాథ్ తనని వేధించడం మొదలుపెట్టాడని ఆరోపించింది. ఆయన మిత్రుడు ఒకరు తనకు ఫోన్ చేసి.. ‘నువ్వంటే రవీంద్రనాథ్కి ఎంతో ఇష్టం, నువ్వు సహకరిస్తే రాణిలా ఉంటావ్, లేకపోతే చంపేస్తాం’ అని బెదిరించాడని వెల్లడించింది.
Karnataka : విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని మృతి చెందిన 8 నెలల చిన్నారి..
మొదట్లో తాను ఈ బెదిరింపును పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఒక రోజు రవీంద్రనాథ్ మద్యం మత్తులో తనకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడని, అది తనకు తీవ్ర ఆవేదనకు గురి చేసిందని గాయత్రి దేవి చెప్పింది. అక్కడి నుంచి వేధింపులు మరింతగా పెరిగాయని.. తనకు కంటి మీద కునుకు లేకుండా చేశారని పేర్కొంది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు బెదిరింపులు ఇంకా పెరిగిపోవడంతో.. తాను భయాందోళనలకు గురై, పోలీసుల్ని ఆశ్రయించానని ఆమె వివరించింది. మరి.. ఈ వివాదం మున్ముందు మరెన్ని పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!