Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, ఆయన భార్యకు పాక్తో సంబంధాలు.. సీఎం సంచలన ఆరోపణలు..
- కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్యపై సంచలన ఆరోపణలు..
- ఇద్దరికి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని సీఎం హిమంత వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్పై, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపణల తీవ్రతను పెంచారు. ఆయనకు, ఆయన భార్యకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్లపై కేంద్రం దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని అన్నారు. గొగోయ్ భార్య పాకిస్తాన్కు భారత రహస్య సమాచారాన్ని ఇచ్చిందని హిమంత ఆరోపించారు.
అసలు కేసు ఏమిటి..?
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఈ కేసు గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్కు పాకిస్థాన్తో, ముఖ్యంగా పాక్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలకు సంబంధించింది. ఆమె పాకిస్తాన్ ప్రణాళిక సంఘం మాజీ సలహాదారు తౌకీర్ షేక్ వద్ద ఇస్లామాబాద్లో పనిచేస్తున్నప్పుడు ఈ సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. ఈ ఆరోపణల్ని దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. సిట్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కేసు సున్నితత్వం దృష్ట్యా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సీఎం హిమంత నిర్ణయించారు.
సంచలన ఆరోపణలు:
గౌరవ్ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్లకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. పాకిస్తాన్ కు చెందిన లీడ్ పాకిస్తాన్ నుంచి ఆమె జీతం కూడా తీసుకునేదని సీఎం వెల్లడించారు. ఎంపీ భార్యను పాక్ నియంత్రిస్తోందని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. ఎలిజబెత్ గతంలో యూఎస్ మాజీ సెనెటర్ టామ్ ఉడాల్, బిలియనీర్ జార్జ్ సోరోస్కు సహాయకురాలిగా పనిచేశారని అన్నారు.
గొగోయ్ భార్య లో-ప్రొఫైల్ మెంటైన్ చేయడానికి పాకిస్తాన్లోకి అటారీ సరిహద్దు గుండా వెళ్లారని హిమంత చెప్పారు. గొగోయ్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె 9 సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. గొగోయ్ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కూడా పాకిస్తాన్ సంస్థకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. 2013లో పాక్ పర్యటనలో గొగోయ్, ఆయన భార్య లాహోర్కు వెళ్లడానికి మాత్రమే అనుమతించారని, కానీ తర్వాత వారు ఇస్లామాబాద్, కరాచీ కూడా వెళ్లడానికి అనుమతించారని, దీని కోసం గొగోయ్ ఈవీసా కోరాడని సీఎం చెప్పారు.
గొగోయ్ తన మైనర్ కుమారుడి కోసం బ్రిటిష్ పౌరసత్వం ఇప్పించడానికి 2022లో ఢిల్లీ పాస్పోర్ట్ ఆఫీస్లో అతడి పాస్పోర్టు అప్పగించారని హిమంత ఆరోపించారు. గౌరవ్ గొగోయ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడిని, ఈ విషయాన్ని పరిశీలించి సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.
అయితే, ఈ ఆరోపణలపై గౌరవ్ గొగోయ్ స్పందించారు. ‘‘సూపర్ ప్లాన్’’ అంటూ ఆన్లైన్ పోస్ట్ పెట్టారు. హిమంత మీడియా సమావేశం సీ-గ్రేడ్ సినిమా కన్నా దారుణంగా ఉందని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అత్యంత తెలివితక్కువ, నిరాధారమైన విషయాలని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!