Lawrence Bishnoi: మూసేవాలా హత్య కేసులో గ్యాంగ్స్టర్ బిష్ణోయ్కు 7 రోజుల రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీని విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు మాన్సా కోర్టుకు తరలించారు. అతనికి మొదట వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరుపరచగా.. అతనికి 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. పోలీసులు 10 రోజుల పోలీసు కస్టడీ కోరగా.. కానీ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది.ప్రశ్నించేందుకు లారెన్స్ బిష్ణోయ్ని మొహాలీకి తీసుకురానున్నారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ పాత్రకు సంబంధించి గ్యాంగ్స్టర్ వ్యతిరేక టాస్క్ఫోర్స్ ఇతర ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక బృందం ప్రశ్నించనుంది.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు పంజాబ్ పోలీసులు మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంజాబ్ అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరై రిమాండ్ విధించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ పోలీసు కస్టడీలో అతని భద్రత కారణంగా నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ యొక్క న్యాయవాదులు పంజాబ్ పోలీసుల అభ్యర్ధనను వ్యతిరేకించారు, దీనిని అడ్వొకేట్ జనరల్ పంజాబ్ వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నిందితులను అరెస్టు చేసేందుకు కోర్టు అనుమతిని మంజూరు చేసింది.
Also Read
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
మే 29న సిద్ధూ మూసేవాలాను గుర్తుతెలియని వ్యక్తులు మాన్సా జిల్లాలో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని పోలీసులు ప్రశ్నించగా.. ఈ హత్య తమ గ్యాంగ్ పనేనని అతడు అంగీకరించాడు. మూసేవాలాతో తమకు వైరం ఉందని.. అందుకే తమ గ్యాంగ్ సభ్యులు అతడిని చంపేశారని అంగీకరించినట్టు ఇటీవలే పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..