Murshidabad Violence: బెంగాల్ ముర్షిదాబాద్లో అల్లర్లు.. వలసకూలీ హత్యతో హింస..
- అల్లర్లతో అట్టుడుకుతున్న బెంగాల్ ముర్షిదాబాద్..
- వలస కూలీ హత్యతో నిరసనకారుల హింస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murshidabad Violence: వలస కూలీ హత్యతో పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు బెల్దంగాలో జాతీయ రహదారి 12ను దిగ్భందించడంతో మళ్లీ అశాంతి నెలకొంది. బెల్దంగాలోని బరువా మోర్ వద్ద వందలాది మంది స్థానికులు రహదారిపై చేరి, ట్రాఫిక్ను స్తంభింపచేశారు. అల్లరి మూకలు ఒక రైల్వే గేటును ధ్వంసం చేశారు. తూర్పు రైల్వేలోని సీల్దా-లాల్గోలా రైల్వే సెక్షన్లో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
Read Also: Flipkart Republic Day Sale: మీ ఇంట్లోనే థియేటర్.. 50 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు!
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టడానికి, దిగ్భందాన్ని ఎత్తివేయడానికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. లాఠీఛార్జ్ చేసి రోడ్లను క్లియర్ చేయాల్సి వచ్చిందని ముర్షిదాబాద్ ఎస్పీ కుమార్ సన్నీ రాజ్ తెలిపారు. గత రెండు రోజులుగా జరిగిన హింసలో 15 నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల వలస కూలీ అలావుద్దీన్ షేక్ జార్ఖండ్ రాష్ట్రంలో హత్యకు గురయ్యాడు. దీంతో ముర్షిదాబాద్లో హింస చెలరేగింది. అతడిని కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ పరిణామాల గురించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో వలస కార్మికుల్ని టార్గెట్ చేస్తున్నారని, మైనారిటీల కోపం సమర్థనీయమే అని అన్నారు. అయితే, తాను ఇలాంటి హింసను సమర్థించనని, కానీ అన్నీ తన చేతుల్లో లేవని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!