Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ.. థాయ్లాండ్ గుహ నుంచి పిల్లల్ని రక్షించిన సంస్థకు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్లో చిక్కుకుపోయిన 40 మంది కూలీల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయపనులు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సాంకేతిక కారణాలు, కొండచరియలు విరిగిపడటం సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన కూలీల కోసం భారత వైమానిక దళానికి చెందిన మూడు ప్రత్యేక విమానాలు 25 టన్నుల ప్రత్యేక యంత్ర సామాగ్రిని సరఫరా చేసింది.
బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఉత్తరకాశీలోని సిల్క్యారా మరియు దండల్గావ్లను కలపడానికి ఉద్దేశించిన 4.5 కిలోమీటర్ల సొరంగంలో ఒక భాగం ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ సొరంగం చార్ ధామ్ ప్రాజెక్టులో భాగం. దీంట్లోనే కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులంతా సజీవంగానే ఉన్నారు. వీరిని రక్షించడానికి అధికార యంత్రాంగం పనిచేస్తోంది.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: Babar Azam: పాక్ టీంకు షాక్.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన బాబర్ ఆజమ్..
2018లో థాయ్లాండ్ లోని గుహలో చిక్కుకుపోయిన పిల్లలను రక్షించేందుకు సహకరించిన వారిని కూడా థాయ్లాండ్, నార్వేల నుంచి రప్పించారు. కూలీలను రక్షించేందుకు వారు కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి తీసుకువస్తున్న ప్రత్యేక యంత్రం గంటలో 4-5 మీటర్ల శిథిలాలను తొలగిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 10-12 గంటల్లో కూలీలు ఉన్న ప్రదేశానికి రెస్క్యూ పైపు వెళ్తుంది. 900 మిమీ వ్యాసం ఉన్న ఈ పైపు రెస్క్యూ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ రోజు సాయంత్రానికి యంత్రం వచ్చే అవకాశం ఉందని, వచ్చిన కొన్ని గంటల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
థాయ్లాండ్ గుహ సంఘటన:
2018లో ఉత్తర థాయ్లాండ్ లోని చియాంగ్ రాయ్ ప్రావిన్సులోని గుహలో జూనియర్ ఫుట్బాల్ టీం చిక్కుకుపోయింది. ఆ తర్వాత క్రమంగా వర్షం పెరగడం, నీరు పెరగడంతో పిల్లలు వెనక్కి తిరిగి రాలేకపోయారు. దీంతో వీరిని రక్షించేందుకు థాయ్లాండ్ కు చెందిన ఓ కంపెనీ రెస్కూలో పాల్గొంది. దాదాపుగా దేశవిదేశాలకు చెందిన 10,000 మంది వారం రోజుల పాటు రెస్క్యూ చేసి పిల్లల్ని కాపాడారు. నార్వేకు చెందిన జియోటెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సాయం తీసుకుంటున్నారు. ఇండియన్ రైల్వేస్లోని నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!