Vande Bharat Express: నవంబర్ 10న ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం.. దక్షిణాదికి తొలి రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధం అవుతుంది. నవంబర్ 10న ఈ రైలును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తే అవన్నీ ఉత్తర భారత దేశంలోనే పలు రూట్లలో నడుస్తున్నాయి. తాజాగా ఈ ఐదో వందే భారత్ రైలును దక్షిణాదిలో తొలిసారిగా ప్రారంభించబోతున్నారు. నవంబర్ నెలలో చెన్నై-బెంగళూర్-మైసూర్ మార్గంలో ఈ రైలును ప్రారంభించనున్నారు.
Read Also: Ravi Shastri: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. గంగూలీకి పరోక్షంగా రవిశాస్త్రి చురకలు
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
భారత రైల్వేల ఆధునీకీకరణలో భాగంగా సెమి హై స్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే నాలుగు రైళ్లను ప్రారంభించారు. గురువారం హిమచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో నాలుగో వందేభారత్ రైలును ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీ, చండీగఢ్ మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటలకు తగ్గించనుంది. హిమచల్ ప్రదేశ్ లోని అంబ్ అందౌరా-న్యూఢిల్లీ మార్గంలో వారంలో బుధవారం మినహా అన్ని రోజుల్లో ప్రయాణించనుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్ సాహిబ్, ఉనా స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు.
అంతకుముందు సెప్టెంబర్ 30న మూడో వందే భారత్ రైలును ప్రధాని మోదీ గుజరాత్ గాంధీనగర్- ముంబైల మధ్య ప్రారంభించారు. భారతదేశంలో మొదటి వందే భారత్ రైలును న్యూఢిల్లీ-వారణాసి మధ్య, రెండో వందే భారత్ రైలును న్యూఢిల్లీ-శ్రీ వైష్ణోదేవి కట్రా మధ్య ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఐదో వందేభారత్ రైలును దక్షిణాదిలో ప్రారంభించనున్నారు. సెమి హైస్పీడ్ ట్రైన్ గా వందే భారత్ రైలును అభివృద్ధి చేశారు. వైఫై, 32 అంగుళాల ఎల్సీడీ టీవీలు, ఆల్ట్రావయోలెట్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్స్ వంటి సేవలు ఈ వందే భారత్ రైలులో ఉన్నాయి. యాంటీ ట్రైన్ కొలిజన్ వ్యవస్థ ‘‘ కవచ్ ’’ వంటి అత్యాధునిక వ్యవస్థలు వందే భారత్ రైలులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!