JEE: మారుమూల గ్రామం, రైతు కుటుంబ నేపథ్యం.. జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE: సాధారణ కుటుంబాలు, పేదరిక నేపథ్యం కలిగిన వ్యక్తులు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఇలాంటి వారు అనేక మంది ర్యాంకులు సాధించారు. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్లో కూడా ఇలాంటి నేపథ్యం ఉన్న బిడ్డలు మెరిశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మహారాష్ట్ర వాషిం జిల్లాలో మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు బిడ్డ నీలకృష్ణ గజారే జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 1వ ర్యాంక్ సాధించారు.
READ ALSO: Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
గత రెండేళ్లుగా పట్టుదల, కృషి ఈ ర్యాంక్ సాధించేలా చేసిందని అతను చెప్పాడు. వాషిం జిల్లాలో మారుమూల గ్రామం బెల్ఖేడ్కి చెందిన నీల్కృష్ణ పరీక్ష కోసం ప్రతీరోజు 10 గంటల కన్నా ఎక్కువ సమయం కేటాయించాడు. నీల్కృష్ణ తండ్రి నిర్మల్ గజరే మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని అన్నారు. నీల్కృష్ణ తన ప్రాథమిక విద్యను అకోలాలోని రాజేశ్వర్ కాన్వెంట్, వాషిమ్లోని కరంజా లాడ్లోని జెసి హైస్కూల్లో చదివాడు. ఆ సమయంతో తన అత్త ఇంట్లో ఉండీ విద్యాభ్యాసం కొనసాగించాడు.
నీల్ కృష్ణ అద్భుతమైన విద్యార్థి అని, క్రీడల్లో నిష్ణాతుడని, ఆర్చరీలో జిల్లా, జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నడాని అతని తండ్రి నిర్మల్ తెలిపారు. ఉదయం 4 గంటలకు లేచి రెండు గంటలు చదువుకుని, మళ్లీ ఉదయం 8.30 గంటల నుంచి చదవడం ప్రారంభించి రాత్రి 10 గంటలకు నిద్ర పోయేవాడని నిర్మల్ వెల్లడించారు. తాను ఎప్పటికీ సాధించలేని వాటిని తన కొడుకు సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు. నీల్కృష్ణ ఐఐటీ బాంబేలో చదువుకోవాలని, సైంటిస్ట్గా ఎదిగేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే నెలలో నిర్వహించనున్న JEE-అడ్వాన్స్డ్కు సిద్ధమవుతున్నాడు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!