CM Yogi: కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది
- కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది
- యూపీ శాసనసభలో సీఎం యోగి వెల్లడి
మహా కుంభమేళా ఓ కుటుంబం యొక్క తలరాత మార్చింది. కుంభమేళా ఆ కుటుంబానికి కాసుల వర్షం కురిపించింది. లక్ష కాదు.. కోటి కాదు.. ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ వార్త చెప్పింది ఎవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రే చెప్పారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad : మలక్ పేట్ శిరీష హత్య కేసులో ట్విస్ట్ ..
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 2025-26 బడ్జె్ట్పై చర్చ సందర్భంగా కుంభమేళాపై సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 130 పడవలు కలిగిన ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందని వెల్లడించారు. కుంభమేళాపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను మంగళవారం ముఖ్యమంత్రి తిప్పికొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పడవలు నడిపిన వారంతా రోజుకి రూ.50,000 నుంచి 52,000 వేలు సంపాదించారని తెలిపారు. ఒక నేరం కూడా జరగకుండా 45 రోజులు ప్రశాంతంగా కుంభమేళా జరిగిందని స్పష్టం చేశారు. ఇక వేధింపులు, కిడ్నాప్లు, దోపిడీలు, హత్యలకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్లారన్నారు. రూ.3లక్షల కోట్ల ఆదాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుంభమేళాను అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసించిందని యోగి గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Warangal: మెడికల్ ఆఫీసర్ల నియామకాల అక్రమాలపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ
మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. మహా శివరాత్రి ఫిబ్రవరి 26న కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరిగింది. దాదాపు 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేశారు. ఇక రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు.
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో