CM Yogi: కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది
- కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది
- యూపీ శాసనసభలో సీఎం యోగి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళా ఓ కుటుంబం యొక్క తలరాత మార్చింది. కుంభమేళా ఆ కుటుంబానికి కాసుల వర్షం కురిపించింది. లక్ష కాదు.. కోటి కాదు.. ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ వార్త చెప్పింది ఎవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రే చెప్పారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad : మలక్ పేట్ శిరీష హత్య కేసులో ట్విస్ట్ ..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 2025-26 బడ్జె్ట్పై చర్చ సందర్భంగా కుంభమేళాపై సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 130 పడవలు కలిగిన ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందని వెల్లడించారు. కుంభమేళాపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను మంగళవారం ముఖ్యమంత్రి తిప్పికొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పడవలు నడిపిన వారంతా రోజుకి రూ.50,000 నుంచి 52,000 వేలు సంపాదించారని తెలిపారు. ఒక నేరం కూడా జరగకుండా 45 రోజులు ప్రశాంతంగా కుంభమేళా జరిగిందని స్పష్టం చేశారు. ఇక వేధింపులు, కిడ్నాప్లు, దోపిడీలు, హత్యలకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్లారన్నారు. రూ.3లక్షల కోట్ల ఆదాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుంభమేళాను అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసించిందని యోగి గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Warangal: మెడికల్ ఆఫీసర్ల నియామకాల అక్రమాలపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ
మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. మహా శివరాత్రి ఫిబ్రవరి 26న కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరిగింది. దాదాపు 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేశారు. ఇక రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!