UPI payments: “యూపీఐ లావాదేవీల”పై తప్పుడు ప్రచారం.. కేంద్రం సీరియస్ వార్నింగ్..
- యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం..
- ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు..
- అంతా వట్టిదే అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI payments: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చిన్ని చిన్న షాపుల్లో పేమెంట్స్కి కూడా గూగుల్ పే, ఫోన్ ఫే వంటి యూపీఐ ఆధారిత యాప్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలను వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రూ.3000 కన్నా ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమే అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
Read Also: US General: “పాకిస్తాన్ ఒక అద్భుత భాగస్వామి”.. అమెరికా నిజ స్వరూపం ఇదే..
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటూ పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా, లావాదేవీల విలువ ఆధారంగా ఎండీఆర్ వసూలు చేసేందుకు చర్చలు సాగుతున్నాయని పలు నివేదికలు వెలువడ్డాయి. అధిక విలువైన డిజిటల్ పేమెంట్స్ నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని సూచించాయి.
ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కేంద్రం సీరియస్గా స్పందించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ఆర్థిక శాఖ ప్రజలకు సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ప్రచారం ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రజల్లో అనవసరమైన అనిశ్చితి, భయాందోళనకు కారణమవుతున్నారని ఎక్స్లో మండిపడింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!