UPI payments: “యూపీఐ లావాదేవీల”పై తప్పుడు ప్రచారం.. కేంద్రం సీరియస్ వార్నింగ్..
- యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం..
- ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు..
- అంతా వట్టిదే అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI payments: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చిన్ని చిన్న షాపుల్లో పేమెంట్స్కి కూడా గూగుల్ పే, ఫోన్ ఫే వంటి యూపీఐ ఆధారిత యాప్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలను వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రూ.3000 కన్నా ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమే అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
Read Also: US General: “పాకిస్తాన్ ఒక అద్భుత భాగస్వామి”.. అమెరికా నిజ స్వరూపం ఇదే..
Also Read
- Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
- Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటూ పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా, లావాదేవీల విలువ ఆధారంగా ఎండీఆర్ వసూలు చేసేందుకు చర్చలు సాగుతున్నాయని పలు నివేదికలు వెలువడ్డాయి. అధిక విలువైన డిజిటల్ పేమెంట్స్ నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని సూచించాయి.
ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కేంద్రం సీరియస్గా స్పందించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ఆర్థిక శాఖ ప్రజలకు సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ప్రచారం ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రజల్లో అనవసరమైన అనిశ్చితి, భయాందోళనకు కారణమవుతున్నారని ఎక్స్లో మండిపడింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!