Joshimath Sinking: కుంగిపోతున్న జోషిమఠ్ పట్టణం.. కారణాలు ఇవే అంటున్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Causes of Joshimath Sinking: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో ఉన్న జోషిమఠ్ పట్టణం కుంగిపోతోంది. అక్కడి ఇప్పటికే 500కు పైగా ఇళ్లు బీటలువారాయి. రోడ్లు కోతలకు గురువుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలను ఆ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతానికి తరలిస్తోంది. శనివారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పట్టణంలో పర్యటించారు. ప్రజలకు పునరావాసం కల్పించడంతో కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లను సిద్ధం చేసింది ప్రభుత్వం.
ఇదిలా ఉంటే జోషిమఠ్ కుంగిపోవడానికి కారణాలు అనేకం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కాలాచంద్ సైన్ ఈ విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు జోషిమఠ్ కుంగుబాటుకు కారణం అవుతున్నాయని అన్నారు. దాదాపుగా 100 ఏళ్ల క్రితం భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఈ కొండచరియల పైనే జోషిమఠ్ పట్టణం ఏర్పడింది. దీంతో పాటు ఈ పట్టణం భూకంపాలు ఎక్కువగా వచ్చే సెస్మిస్ జోన్-5లో ఉంది. దీనికి తోడు వాతావరణం, నీటి ప్రవాహాలు అక్కడి నేలపై, శిలల బంధన బలాలపై ప్రభావం చూపిస్తున్నాయి.
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..

Read Also: VBIT College : విద్యార్థినుల ఫోటో మార్ఫింగ్ కేసు.. ఆ నలుగురే నిందితులు
1886లో హిమాలయన్ గెజిటీర్ లో అట్కిన్స్ కొండచరియాలు విరిగిపడిన శిథిలాల మీద జోషిమఠ్ ఉందని ప్రస్తావించారు. ఆ తరువాత 1976లో మిశ్రా కమిటీ జోషిమఠ్ ను ప్రస్తావించింది. గత ఏడాది రిషిగంగా, ధౌలిగంగ నదులకు భారీగా వరదలు సంభవించాయి. ఈ వరదలు, వాతావరణ జోషిమఠ్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలకు నేల నుంచి సహకారం లభించాలి..కానీ జోషిమఠ్ లో ఈ పరిస్థితి లేదు. కొండచరియలు తక్కువ బేరింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. ఇది అధిక నిర్మాణ రేటుకు మద్దతు ఇవ్వదని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. పెరిగిన నిర్మాణాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, జాతీయ రహదారి విస్తరణ గత రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని అస్థిరంగా మార్చింది.
జోషిమత్ బద్రీనాథ్కి గేట్వే ఉండటంతో పాటు ఈ ప్రాంతం సైనికంగా వ్యూహాత్మకంగా ఉంది. దీంతో అక్కడ ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు, హోటళ్లు పుట్టుకొచ్చాయి. ఇది కూడా అక్కడి నేలను మరింత బలహీనంగా మార్చినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు హిమాలయ ప్రాంతంలో భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల ఆక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఏడాది ఒక సెంటీమీటర్ చొోప్పున ఇండియా భూభాగం ఉత్తరానికి కదులుతూ, ఆసియా టెక్టానిక్ ప్లేట్ ను తోస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. ఇవన్నీ కలిసి జోషిమఠ్ ను కుంగిపోయేలా చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!