NTV Telugu Site icon

Puja khedhkar: ముందస్తు బెయిల్ కోసం పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో పిటిషన్

Iaspujakhedkar

Iaspujakhedkar

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా.. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై యూపీఎస్సీ యాక్షన్ తీసుకుంది. ఆమె శిక్షణను నిలిపివేసింది. అలాగే రిపోర్టు చేయాలని ఆదేశించింది. కానీ ఆమె మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రిపోర్టు చేయలేదు. ఇక తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించినందుకు ఆమెపై ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.