Aam Admi Party: ఆప్ గుర్తింపును రద్దు చేయాలి.. ఈసీకి మాజీ బ్యూరోక్రాట్ల లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Admi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై చర్యలు తీసుకోవాలని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తింపును ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం గురువారం భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. గుజరాత్లో తన పార్టీ కోసం పనిచేసేలా ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపించడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు.ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్, కేటాయింపు) ఆర్డర్లోని సెక్షన్ 1ఏను ఆప్ ఉల్లంఘించిందని రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం ఎన్నికల కమిషన్కు లేఖ రాసిందని కర్ణాటక మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.మదన్ గోపాల్ తెలిపారు.
“ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. పోలీస్ సిబ్బంది, హోం గార్డులు, అంగన్వాడీ వర్కర్స్, ప్రజారవాణ వ్యవస్థలోని డ్రైవర్లను, ఆఖరికి పోలింగ్ బూత్ ఆఫీసర్లను కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్ కోసం పని చేయాలని పిలుపు ఇచ్చారు. కానీ, ఇలా ప్రజా సేవకులను.. ఒక పార్టీ, అదీ అధికారంలో ఉన్న పార్టీ తమ ఎన్నికల స్వార్థం కోసం వాడుకోవడం సరైంది కాదు. ఇది ప్రజా ప్రతినిధుల చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించేలా ఉంది. అంతేకాదు.. 1968 ఎన్నికల సింబల్స్ ఆర్డర్లోని 16ఏ ఉల్లంఘిస్తుంది.” కాబట్టి, లేఖను పరిగణనలోకి తీసుకుని ఆప్ గుర్తింపు రద్దు చేయాలని లేఖలో బ్యూరోక్రట్లు కోరారు.
Also Read
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
Nitish Kumar: నితీష్ కుమార్ సంచలన ప్రకటన.. బీజేపీయేతర కూటమి గెలిస్తే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా!
“ఎన్నికల ముందు ప్రచారం చేయడం అతని హక్కు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ల డ్రైవర్లు, కండక్టర్లు, పోలీసు సిబ్బంది ఫలానా పార్టీ కోసం పనిచేయాలని ఆయన చేసిన విజ్ఞప్తి చాలా తప్పు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేయకూడదు. మాకు ప్రవర్తనా నియమావళి ఉంది. మా విధేయత భారత రాజ్యాంగానికి ఉంది. ఈ ప్రాధాన్యత ప్రజాస్వామ్య ప్రక్రియలకు మంచిది కాదు” అని మాజీ బ్యూరోక్రాట్ ఎం.మదన్ గోపాల్ అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మంచిది కాదని గోపాల్ అన్నారు.
సెప్టెంబర్ 3న గుజరాత్లో విలేకరుల సమావేశంలో ఆప్ కన్వీనర్ ప్రభుత్వ ఉద్యోగులను పార్టీ కోసం పని చేసేందుకు ప్రేరేపించారని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్పై చర్య తీసుకోవాలని కోరుతూ 56 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు గురువారం ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఈ లేఖపై మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఇతర సర్వీసుల అధికారులు సంతకాలు చేశారు.
తాజావార్తలు
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
-
Hyderabad: వనస్థలిపురంలో అక్రమ ‘లింగ నిర్ధారణ’ రాకెట్ భగ్నం.!
-
Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
-
Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!