Yogi Adityanath: ‘‘నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు’’..కాంగ్రెస్పై సీఎం యోగి ఫైర్..
- అంబేద్కర్కి వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం చేశారు..
- కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో అంబేద్కర్ని చేర్చడానికి జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారని యోగి అన్నారు. గత వారం రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో యోగి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
దళితులను, అణగారిని వర్గాల వారిని అగౌరపరిచే కాంగ్రెస్ విధానాన్ని సమాజ్వాదీ పార్టీ కూడా అవలంబిస్తోందని ఆయన అన్నారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉన్న గౌరవం కాంగ్రెస్కి లేదని, అంబేద్కర్ చదువుకున్న మోవ్, నాగ్పూర్, ముంబై, లండన్లోని ముఖ్యప్రదేశాలను స్మారక చిహ్నాలు రూపొందించినట్లు వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలోని అటల్ బీహారీ వాజ్పేయి ప్రభుత్వమైనా, నరేంద్రమోడీ ప్రభుత్వమైనా అంబేద్కర్ ఆశయాలను గౌరవించిందని చెప్పారు.
రాజ్యాంగ పరిషరత్, ముసాయిదా కమిటీలో అంబేద్కర్ని చేర్చుకునే ఆసక్తి కాంగ్రెస్కి లేదని చెప్పారు. ముంబై నార్త్ నుండి 1952 సాధారణ ఎన్నికలు, 1954 ఉప ఎన్నికలతో సహా ఎన్నికలలో అంబేద్కర్ను ఓడించడానికి కాంగ్రెస్ కృషి చేసిందని ఆరోపించారు. నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఆయన ఓడిపోయేలా చేశారంటూ ఆరోపించారు. అంబేద్కర్ జీవించి ఉన్నంతకాలం ఆయనకు గౌరవం ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని యోగి విమర్శించారు. బీజేపీనే అంబేద్కర్కి భారతరత్న ఇచ్చి గౌరవించిందని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధిపొందాలని అనుకుందని, బీజేపీ ఎంపీలపై దాడి చేయడం రాజ్యాంగ బద్ధమా అని కాంగ్రెస్ని యోగి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!