Yogi Adityanath: ‘‘నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు’’..కాంగ్రెస్పై సీఎం యోగి ఫైర్..
- అంబేద్కర్కి వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం చేశారు..
- కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో అంబేద్కర్ని చేర్చడానికి జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారని యోగి అన్నారు. గత వారం రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో యోగి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
దళితులను, అణగారిని వర్గాల వారిని అగౌరపరిచే కాంగ్రెస్ విధానాన్ని సమాజ్వాదీ పార్టీ కూడా అవలంబిస్తోందని ఆయన అన్నారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉన్న గౌరవం కాంగ్రెస్కి లేదని, అంబేద్కర్ చదువుకున్న మోవ్, నాగ్పూర్, ముంబై, లండన్లోని ముఖ్యప్రదేశాలను స్మారక చిహ్నాలు రూపొందించినట్లు వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలోని అటల్ బీహారీ వాజ్పేయి ప్రభుత్వమైనా, నరేంద్రమోడీ ప్రభుత్వమైనా అంబేద్కర్ ఆశయాలను గౌరవించిందని చెప్పారు.
రాజ్యాంగ పరిషరత్, ముసాయిదా కమిటీలో అంబేద్కర్ని చేర్చుకునే ఆసక్తి కాంగ్రెస్కి లేదని చెప్పారు. ముంబై నార్త్ నుండి 1952 సాధారణ ఎన్నికలు, 1954 ఉప ఎన్నికలతో సహా ఎన్నికలలో అంబేద్కర్ను ఓడించడానికి కాంగ్రెస్ కృషి చేసిందని ఆరోపించారు. నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఆయన ఓడిపోయేలా చేశారంటూ ఆరోపించారు. అంబేద్కర్ జీవించి ఉన్నంతకాలం ఆయనకు గౌరవం ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని యోగి విమర్శించారు. బీజేపీనే అంబేద్కర్కి భారతరత్న ఇచ్చి గౌరవించిందని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధిపొందాలని అనుకుందని, బీజేపీ ఎంపీలపై దాడి చేయడం రాజ్యాంగ బద్ధమా అని కాంగ్రెస్ని యోగి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!