Yogi Adityanath: ‘‘నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు’’..కాంగ్రెస్పై సీఎం యోగి ఫైర్..
- అంబేద్కర్కి వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం చేశారు..
- కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో అంబేద్కర్ని చేర్చడానికి జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారని యోగి అన్నారు. గత వారం రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో యోగి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
దళితులను, అణగారిని వర్గాల వారిని అగౌరపరిచే కాంగ్రెస్ విధానాన్ని సమాజ్వాదీ పార్టీ కూడా అవలంబిస్తోందని ఆయన అన్నారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉన్న గౌరవం కాంగ్రెస్కి లేదని, అంబేద్కర్ చదువుకున్న మోవ్, నాగ్పూర్, ముంబై, లండన్లోని ముఖ్యప్రదేశాలను స్మారక చిహ్నాలు రూపొందించినట్లు వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలోని అటల్ బీహారీ వాజ్పేయి ప్రభుత్వమైనా, నరేంద్రమోడీ ప్రభుత్వమైనా అంబేద్కర్ ఆశయాలను గౌరవించిందని చెప్పారు.
రాజ్యాంగ పరిషరత్, ముసాయిదా కమిటీలో అంబేద్కర్ని చేర్చుకునే ఆసక్తి కాంగ్రెస్కి లేదని చెప్పారు. ముంబై నార్త్ నుండి 1952 సాధారణ ఎన్నికలు, 1954 ఉప ఎన్నికలతో సహా ఎన్నికలలో అంబేద్కర్ను ఓడించడానికి కాంగ్రెస్ కృషి చేసిందని ఆరోపించారు. నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఆయన ఓడిపోయేలా చేశారంటూ ఆరోపించారు. అంబేద్కర్ జీవించి ఉన్నంతకాలం ఆయనకు గౌరవం ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని యోగి విమర్శించారు. బీజేపీనే అంబేద్కర్కి భారతరత్న ఇచ్చి గౌరవించిందని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధిపొందాలని అనుకుందని, బీజేపీ ఎంపీలపై దాడి చేయడం రాజ్యాంగ బద్ధమా అని కాంగ్రెస్ని యోగి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!