Elephant Attack Brothers: అన్నదమ్ములను తొక్కి చంపిన ఏనుగు.. రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రులపై
Elephant Attack Brothers: ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా కిర్మిరా బ్లాక్ పరిధిలోని భౌంరా గ్రామ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు సోదరులను వారి తల్లిదండ్రుల ముందే తొక్కి చంపింది ఏనుగు. పిల్లలను రక్షించే ప్రయత్నంలో దంపతులకు తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఝర్సుగూడ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
Read also: Gold Rates: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
నివేదికల ప్రకారం, ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాకు చెందిన ఉమేష్ రామ్ సత్నామీ మరియు అతని భార్య లెహెరాబాయి సత్నామి వారి ఇద్దరు కుమారులు ధనంజయ్ (9), అభయ్ (11)లతో కలిసి స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో పని చేయడానికి గ్రామానికి వచ్చారు. పని ప్రదేశం సమీపంలో కుటుంబం నిద్రిస్తుండగా, ఇద్దరు సోదరులపై ఏనుగు దాడి చేసింది. కన్న బిడ్డలను కాపాడేందుకు దంపతులు ప్రయత్నించినా ఫలించలేకుండాపోయింది. ఏనుగు దాడి ఘటనలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఏడు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించడం గమనార్హం. అటవీశాఖ అధికారులు జంతువులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
Astrology: నవంబర్ 05, శనివారం దినఫలాలు
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!