Site icon NTV Telugu

Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్‌

Elections 2026

Elections 2026

Elections 2026: పశ్చిమ బెంగాల్ తొలి విడత, తమిళనాడు ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు సునామీ సృష్టించారు. 1947 స్వాతంత్ర్యం అనంతరం ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో 92.25 శాతం, తమిళనాడులో 85.03 శాతం అత్యధిక ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ భారీగా పెరగడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. ఓటర్ల బలమైన భాగస్వామ్యానికి నిదర్శనమని అభివర్ణించారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టమని చెప్పారు.

Read Also: Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉంటే, తొలివిడతలో భాగంగా గురువారం 152 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో మిగిలిన అసెంబ్లీలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. బెంగాల్ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షిదాబాద్‌లో టీఎంసీ, హుయాయున్ కబీర్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే, పెరిగిన ఓటింగ్ ప్రజల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓట్ల తొలగింపు ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తోందని మళ్లీ టీఎంసీ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ ఈ ఓటింగ్‌ను మార్పుకు సంకేతంగా అభివర్ణించారు.

మరోవైపు, తమిళనాడులో కూడా ఇదే తరహాలో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. మొత్తం 234 స్థానాలకు ఒకే రోజు ఎన్నికలు జరిగాయి. డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఎండల్ని సైతం లెక్క చేయకుండా పల్లెలు, పట్టణాల్లో ఓటర్లు బారులు తీరారు.

Exit mobile version