పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అధికారులపై తీవ్రమైన దుష్ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ‘‘SIR’’ విషయంలో అధికారుల దుర్వినియోగంపై కీలక మైన ఆధారాలను సేకరించింది. దీంతో 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 13CC కింద అధికారులను సస్పెండ్ చేసింది. తక్షణమే ఎలాంటి ఆలస్యంగా లేకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
నివేదికల ప్రకారం.. సస్పెండ్ చేయబడిన అధికారుల్లో ముర్షిదాబాద్లోని సంసేర్గంజ్కు చెందిన AERO డాక్టర్ సఫీ ఉర్ రెహమాన్, ఫరక్కాకు చెందిన AERO నితీష్ దాస్ ఉన్నారు. మైనాగురికి చెందిన డాలియా రే చౌదరి, సుతి బ్లాక్కు చెందిన SK ముర్షిద్ ఆలం కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే దక్షిణ 24 పరగణాలలోని కానింగ్ పుర్బో నియోజకవర్గానికి చెందిన AROలు సత్యజిత్ దాస్, జోయ్దీప్ కుండులను కూడా సస్పెండ్ చేశారు. జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (BDO), డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ARO దేబాషిష్ బిశ్వాస్పై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ అధికారులపై తీవ్ర నిర్లక్ష్యం, ఎన్నికల చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కమిషన్కు నిరూపితమైన ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు తర్వాత తక్షణ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
SIR ప్రక్రియలో ఏదైనా నిర్లక్ష్యం లేదా ఏకపక్షతను సహించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా చూసేందుకు కమిషన్ ఈ చర్య ఒక ప్రధాన హెచ్చరికగా భావిస్తున్నారు.
