EVM: ‘‘ఈవీఎంలు హ్యాక్ అవుతాయి’’.. తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలపై ఈసీ క్లారిటీ..
- ఈవీఎంలు హ్యాకింగ్ వాదనల్ని తోసిపుచ్చిన ఎన్నికల సంఘం..
- తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలపై ఈసీ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EVM: భారత ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎంలు) హ్యాక్ అవుతాయనే ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ యంత్రాలు ఇంటర్నెట్ లేదా ఇన్ఫ్రారెడ్తో అనుసంధానించడబటం లేదని, సాధారణ కాలిక్యులేటర్ల వలే పనిచేస్తాయని పేర్కొంది. ఓట్లను తారుమారు చేయడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్లను హ్యాకింగ్ చేసే దుర్భలత్వానికి సంబంధించిన ఆధారాలను తమ కార్యాలయం పొందిందని యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. కొన్ని దేశాలు ఇంటర్నెట్తో సహా వివిధ ప్రైవేట్ నెట్వర్క్లతో సహా మల్టీ సిస్టమ్స్తో అనుసంధానించబడిన ‘‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థల్ని’’ కలిగి ఉందని ఈసీ ఎత్తిచూపింది.
Read Also: Amit Shah: తమిళానికి స్టాలిన్ ఏం చేశారు.? బీజేపీ తమిళ భాష, సంస్కృతిని గౌరవిస్తుంది
Also Read
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
భారతదేశంలో సరళమైన, ఖచ్చితమైన కాలిక్యులేటర్ల వలే పనిచేసే ఈవీఎంలను ఉపయోగిస్తోందని, ఇది హ్యాకింగ్కి అవకాశం లేకుండా ఎలాంటి ఇంటర్నెట్, ఇన్ఫ్రారెడ్లతో అనుసంధానించడం లేదని ఈసీ చెప్పింది. ఈ యంత్రాలు సుప్రీంకోర్టు చట్టపరమైన పరిశీలనకు గురయ్యాయని, వాస్తవ పోలింగ్కి ముందు మాక్ పోలింగ్ నిర్వహించడంతో సహా వివిధ దశల్లో రాజకీయ పార్టీలతో నిరంతరం తనిఖీ చేయబడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీలు లెక్కింపు ముందు ఐదు కోట్లకు పైగా పేపర్ ట్రైల్ మెషిన్ స్లిప్లను ధ్రువీకరించి, సరిపోల్చుతాయని చెప్పింది.
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గతేడాది ఈవీఎంలను తొలగించాలని పిలుపునిచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయవచ్చని హెచ్చరించారు. అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మస్క్ వాదనలకి స్పందిస్తూ, ‘‘”మన ఎన్నికలు జరుగుతున్నప్పుడు EVMలను హ్యాక్ చేయవచ్చని ఒక ప్రపంచ ఐటీ నిపుణుడు అన్నారు. వారి వద్ద (యుఎస్) EVMలు లేవు, వారి వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలు ఉన్నాయి. అదే వ్యక్తి తరువాత భారతదేశంలో ఓట్ల లెక్కింపు పూర్తిగా ఒక రోజులో ముగుస్తుందని, యూఎస్లో నెల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు’’ అనే విషయాన్ని గుర్తు చేశారు. .
తాజావార్తలు
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!