EVM: ‘‘ఈవీఎంలు హ్యాక్ అవుతాయి’’.. తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలపై ఈసీ క్లారిటీ..
- ఈవీఎంలు హ్యాకింగ్ వాదనల్ని తోసిపుచ్చిన ఎన్నికల సంఘం..
- తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలపై ఈసీ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EVM: భారత ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎంలు) హ్యాక్ అవుతాయనే ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ యంత్రాలు ఇంటర్నెట్ లేదా ఇన్ఫ్రారెడ్తో అనుసంధానించడబటం లేదని, సాధారణ కాలిక్యులేటర్ల వలే పనిచేస్తాయని పేర్కొంది. ఓట్లను తారుమారు చేయడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్లను హ్యాకింగ్ చేసే దుర్భలత్వానికి సంబంధించిన ఆధారాలను తమ కార్యాలయం పొందిందని యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. కొన్ని దేశాలు ఇంటర్నెట్తో సహా వివిధ ప్రైవేట్ నెట్వర్క్లతో సహా మల్టీ సిస్టమ్స్తో అనుసంధానించబడిన ‘‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థల్ని’’ కలిగి ఉందని ఈసీ ఎత్తిచూపింది.
Read Also: Amit Shah: తమిళానికి స్టాలిన్ ఏం చేశారు.? బీజేపీ తమిళ భాష, సంస్కృతిని గౌరవిస్తుంది
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
భారతదేశంలో సరళమైన, ఖచ్చితమైన కాలిక్యులేటర్ల వలే పనిచేసే ఈవీఎంలను ఉపయోగిస్తోందని, ఇది హ్యాకింగ్కి అవకాశం లేకుండా ఎలాంటి ఇంటర్నెట్, ఇన్ఫ్రారెడ్లతో అనుసంధానించడం లేదని ఈసీ చెప్పింది. ఈ యంత్రాలు సుప్రీంకోర్టు చట్టపరమైన పరిశీలనకు గురయ్యాయని, వాస్తవ పోలింగ్కి ముందు మాక్ పోలింగ్ నిర్వహించడంతో సహా వివిధ దశల్లో రాజకీయ పార్టీలతో నిరంతరం తనిఖీ చేయబడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీలు లెక్కింపు ముందు ఐదు కోట్లకు పైగా పేపర్ ట్రైల్ మెషిన్ స్లిప్లను ధ్రువీకరించి, సరిపోల్చుతాయని చెప్పింది.
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గతేడాది ఈవీఎంలను తొలగించాలని పిలుపునిచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయవచ్చని హెచ్చరించారు. అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మస్క్ వాదనలకి స్పందిస్తూ, ‘‘”మన ఎన్నికలు జరుగుతున్నప్పుడు EVMలను హ్యాక్ చేయవచ్చని ఒక ప్రపంచ ఐటీ నిపుణుడు అన్నారు. వారి వద్ద (యుఎస్) EVMలు లేవు, వారి వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలు ఉన్నాయి. అదే వ్యక్తి తరువాత భారతదేశంలో ఓట్ల లెక్కింపు పూర్తిగా ఒక రోజులో ముగుస్తుందని, యూఎస్లో నెల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు’’ అనే విషయాన్ని గుర్తు చేశారు. .
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..