ఢిల్లీలో ప్రధాని మోడీతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు. ఈ సమావేశం సరికొత్త రాజకీయ ఊహాగానాలకు తెరలేపుతోంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకుని.. షిండేను తిరిగి మహారాష్ట్ర సీఎంను చేయాలని కేంద్రం భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో షిండే సమావేశం అయినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం ముంబైలో ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం సునేత్ర పవార్తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం అయ్యారు. ఈ భేటీ కూడా రాజకీయంగా తీవ్ర చర్చోపచర్చలకు దారి తీసింది. సునేత్ర పవార్ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య షిండే హఠాత్తుగా ప్రధాని మోడీని కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని దేవేంద్ర ఫఢ్నవిస్తో భర్తీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కీలక పరిణామాలు జరిగేటట్టు కనిపిస్తున్నాయి.
📍 #नवी_दिल्ली |
देशाचे आदरणीय पंतप्रधान @narendramodi जी यांची आज त्यांच्या नवी दिल्ली येथील निवासस्थानी उपस्थित राहून #शिवसेना खासदारांसह सदिच्छा भेट घेतली. या भेटीत लोकसभेचे संसदीय अधिवेशन, त्यातील कामकाज, शिवसेनेच्या खासदारांची भूमिका तसेच राज्यात सुरू असलेली विकासकामे,… pic.twitter.com/l9C8ZrxrRt
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) August 7, 2026

