MUDA scam: ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ..
- సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్..
- ముడా స్కాంలో భార్యతో పాటు ఆయన ప్రమేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ కేటాయింపులు వంటి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈడీ నివేదిక ప్రకారం.. ఈ కుంభకోణంలో అధికారిక రికార్డులు తారుమారు చేయడం, రాజకీయ ప్రభావాన్ని దుర్వినియోగం చేయడం, ఫోర్జరరీ వంటివి చోటు చేసుకున్నట్లు తెలిపింది. ప్రజాభివృద్ధి కోసం సేకరించిన భూమిని అక్రమంగా డీ నోటిఫై చేయడం ఈ కేసులో కీలకంగా ఉంది. ఈ ప్రక్రియను నిపుణుల సమీక్ష, ఎలాంటి శ్రద్ధ లేకుండా చేపట్టారని ఈడీ తెలిపింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య, ముడా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. రెవెన్యూ అధికారుల మోసపూరిత భూ మార్పిడిని కూడా నివేదిక హైలెట్ చేసింది. నిర్మాణాలు శాటిలైట్ ఇమేజుల్లో, రికార్డుల్లో పొంతన లేకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన బీఎం మల్లికార్జున స్వామి సమర్పించిన నష్టపరిహార బాండ్లో ఆయన సంతకం లేకపోవడం వల్ల పత్రాలు తారుమారు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి అక్రమంగా స్థలాల కేటాయింపు వివాదాస్పదమైంది. మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో, విలువైన 14 స్థలాలను కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, ఈడీ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత ఈ స్థలాలను తిరిగి ముడాకు అప్పగించారు. స్థల కేటాయింపుల సమయంలో ముడా ఎమ్మెల్యేగా సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర ఉన్నారు. ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని కూడా ఎత్తి చూపింది. సిద్దరామయ్య సన్నిహితుడు సీటీ కుమార్ అని పిలువబడే ఎస్జీ దినేష్ కుమార్, పార్వతికి అనుకూలంగా సైట్ల కేటాయింపులలో ఫోర్జరీ, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!