MUDA scam: ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ..
- సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్..
- ముడా స్కాంలో భార్యతో పాటు ఆయన ప్రమేయం..
MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ కేటాయింపులు వంటి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈడీ నివేదిక ప్రకారం.. ఈ కుంభకోణంలో అధికారిక రికార్డులు తారుమారు చేయడం, రాజకీయ ప్రభావాన్ని దుర్వినియోగం చేయడం, ఫోర్జరరీ వంటివి చోటు చేసుకున్నట్లు తెలిపింది. ప్రజాభివృద్ధి కోసం సేకరించిన భూమిని అక్రమంగా డీ నోటిఫై చేయడం ఈ కేసులో కీలకంగా ఉంది. ఈ ప్రక్రియను నిపుణుల సమీక్ష, ఎలాంటి శ్రద్ధ లేకుండా చేపట్టారని ఈడీ తెలిపింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య, ముడా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. రెవెన్యూ అధికారుల మోసపూరిత భూ మార్పిడిని కూడా నివేదిక హైలెట్ చేసింది. నిర్మాణాలు శాటిలైట్ ఇమేజుల్లో, రికార్డుల్లో పొంతన లేకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన బీఎం మల్లికార్జున స్వామి సమర్పించిన నష్టపరిహార బాండ్లో ఆయన సంతకం లేకపోవడం వల్ల పత్రాలు తారుమారు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి అక్రమంగా స్థలాల కేటాయింపు వివాదాస్పదమైంది. మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో, విలువైన 14 స్థలాలను కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, ఈడీ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత ఈ స్థలాలను తిరిగి ముడాకు అప్పగించారు. స్థల కేటాయింపుల సమయంలో ముడా ఎమ్మెల్యేగా సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర ఉన్నారు. ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని కూడా ఎత్తి చూపింది. సిద్దరామయ్య సన్నిహితుడు సీటీ కుమార్ అని పిలువబడే ఎస్జీ దినేష్ కుమార్, పార్వతికి అనుకూలంగా సైట్ల కేటాయింపులలో ఫోర్జరీ, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!