New Ration Cards: రేషన్ కార్డుల గందరగోళంపై ఈసీ క్లారిటీ
- రేషన్ కార్డుల గందరగోళంపై ఈసీ క్లారిటీ
- మీడియా కథనాలు ఖండించిన ఈసీ
- ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మీ సేవా ద్వారా రేషన్ కార్డుల జారీని ఎన్నికల సంఘం నిలిపివేసిందంటూ వచ్చిన మీడియా కథనాలను ఈసీ తప్పుపట్టింది. ఈ వార్తలు తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి ప్రసారాలు తప్పు అని కొట్టిపారేశారు. ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ గానీ, మీసేవా గానీ మమ్మల్ని సంప్రదించలేదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను నిర్ద్వందగా ఖండిస్తున్నామన్నారు. తప్పులను సరిదిద్దాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్ష..
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత నెల 26న గ్రామ సభల్లో దరఖాస్తు చేయని వారు కూడా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అటు పౌరసరఫరాల శాఖ సైతం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు మీ సేవా ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిరంరత ప్రక్రియ అని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల స్వీకరణను వెంటనే ప్రారంభిచాలని మరోవైపు ప్రభుత్వం కూడా ఆదేశించింది.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిలిపివేసిందంటూ వార్తలు రావడంతో ఈసీ స్పందించి కొట్టిపారేసింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: New Ration Cards: ‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు.. పౌరసరఫరాల శాఖ ఏం చెప్పిదంటే..?
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..