BJP: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాలుగు కీలక పదవుల్లో మూడింటిని గెలుచుకున్న తర్వాత బీజేపీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘‘ఛాత్రోంకీ గుంజ్’’( విద్యార్థి ప్రతిధ్వని)ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇండోర్లో విద్యార్థి కార్యక్రమంలో ఉన్న సమయంలోనే శనివారం ఈ ఫలితాలు వెలువడ్డాయి.
కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘గూంజ్ (ప్రతిధ్వని) అయితే వినిపించలేదు.. కానీ ధమాకా (పేలుడు) మాత్రం ఖచ్చితంగా వినిపించింది’’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విజయంపై ABVPకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ABVP సిద్ధాంతం, ‘‘నేషన్ ఫస్ట్’’ భావజాలంపై ఉన్న నమ్మకనాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాదో జోషి కూడా ABVP అభ్యర్థులకు అభినందనలు తెలియాజేశారు. మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ‘‘యువత గొంతు స్పష్టంగా వినిపిస్తోంది’’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI ఒక్క స్థానంలో గెలవలేదు. అధ్యక్ష పదవిలో ABVP అభ్యర్థి యశ్ దబాస్, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన NSUI అభ్యర్థి విజయ్ శంకర్ మీనాను ఓడించారు. దబాస్కు 24,576 ఓట్లు రాగా, మీనాకు 22,523 ఓట్లు వచ్చాయి. దీంతో దబాస్ 2,053 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్గా స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుపొందారు. సెక్రటరీ, వైస్ సెక్రటరీ పదవుల్ని ఏబీవీపీకి చెందిన రియా ఛావ్డీ, లక్ష్యరాజ్ సింగ్ గెలుచుకున్నారు.

