NTV Telugu Site icon

PM Modi: మంత్రి పదవులని మభ్యపెడతారు, చూసుకోండి.. ఎంపీలకు మోడీ సందేశం..

Pm Modi

Pm Modi

PM Modi: ఎన్డీయే పక్ష నేత ప్రధాని నరేంద్రమోడీని ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడి టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, షిండే శివసేన పార్టీలు ఏకగ్రీవంగా ప్రధాని మోడీకి మద్దతు తెలిపాయి. ఎన్డీయే పార్టమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. వదంతులు, ఊహాగానాలకు బలైపోవద్దని సందేశం ఇచ్చారు. ప్రతీ విషయాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు మంత్రి పదవులు వస్తున్నట్లు మీడియా రిపోర్టులు రావడంపై మోడీ స్పందించారు.

Read Also: Renu Desai: చెప్పాల్సింది పవన్ కే చెప్పా.. ఇక చెప్పేదేం లేదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

‘‘ మీకు క్యాబినెట్ బెర్త్ కేటాయించారని క్లెయిమ్‌లతో మిమ్మల్ని సంప్రదించవచ్చు మరియు కాల్ చేయవచ్చు. నేటి అధునాతన సాంకేతికత నా డిజిటల్ సంతకాలతో కూడిన పత్రాలను కూడా విడుదల చేయడానికి దారితీయవచ్చు. కానీ, మీరు వాటిని నమ్మకూడదు.’’ అని ప్రధాని చెప్పారు. ఈ ట్రాప్‌లో పడకుండా వచ్చిన వివరాలను అథారిటీలో క్రాస్ చెక్ చేసుకోవాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ ఆధారంగా దేశం నడవదని ఆయన చెప్పారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు పీహెచ్‌డీ చేశాయని విరుచుకుపడ్డారు.