Dolo 650: డోలో 650 మందులు రాసినందుకు డాక్టర్లకు తాయిలాలు.. సీరియస్ గా తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOLO-65O makers spent Rs 1,000 crore as freebies on doctors for prescribing: మైక్రో ల్యాబ్స్ ఫార్మా కంపెనీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా డోలో -650 మెడిసిన్ సూచించారు. మైక్రోల్యాబ్స్ ఫార్మా కంపెనీ డోలో-650 ట్యాబ్లెట్లు వేసుకోవాలని డాక్టర్లకు సూచించాలని.. డాక్టర్లకు రూ.1000 కోట్ల తాయితాలు ఇచ్చింది. ఈ కేసుపై విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఇది తీవ్రమైన సమస్య అని పేర్కొంది.
డోలో -650 తయారీదారులు రూ. 1000 కోట్ల విలువైన తాయిలాలను వైద్యులకు ఇచ్చారని.. ఈ ట్యాబ్లెట్లను కరోనా సమయంలో రోగులకు సూచించాలని చెప్పారని ఫెడరల్ ఆఫ్ మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంలో వాదించింది. పెడరేషన్ ఆఫ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరుపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదించారు. డోలోను జ్వర నివారణ ఔషధంగా సూచించేందుకు డాక్టర్లకు ఉచితాల కింద రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టారని సుప్రీం కోర్టుకు తెలిపారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ సంజయ్ పారిఖ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) నివేదికను కోర్టుకు అందించారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Lover suicide attempt: ప్రియురాలి బంధువుల బెదిరింపులు.. ప్రియుడి అఘాయిత్యం
ఈ స్కామ్ పై జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది నా చెవులకు సంగీతం కాదని.. నాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారని.. ఇది తీవ్రమైన సమస్య అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సదరు ఫార్మాస్యూటికల్ కంపెనీలను బాధ్యులను చేసేలా ఆదేశాలను కోరుతూ పిల్ దాఖలు చేశారు. మార్కెట్లో మరిన్ని యాంటీబయాటిక్లు అవసరం లేకపోయినా వివిధ కాంబినేషన్లలో ప్రమోట్ చేస్తున్నారని. డ్రగ్ ఫార్ములేషన్లను నియంత్రించడానికి చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్ ఉండాలని న్యాయవాది పారిఖ్ సుప్రీంకోర్టులో వాదించారు. ఈ పిల్ పై కేంద్రం వారంలోగా తన స్పందన తెలియజేయాలని.. ఈకేసు 10 రోజులకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!