PFI: పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని పెరుగుతున్న డిమాండ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demands to ban PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు, మనీలాండరింగ్ కు పాల్పడుతుందని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ), ఈడీలు సంయుక్తంగా 15 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపాయి. 100కు పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ‘ ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐని నిషేధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి.
ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మతపరమైన అలర్లను ప్రేరేపించే కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్న పీఎఫ్ఐని బ్యాన్ చేయాలని కోరారు. సున్నీ, సూఫీ, బరుల్వీ ముస్లిందరినీ ఈ సంస్థలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని షహబుద్దీన్ కోరారు. దేశసమైక్యత, సమగ్రత కాపాడేందుకు ఇలాంటి సంస్థలపై తక్షణమే నిషేధం విధించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆయన మద్దతు ఇచ్చారు.
Also Read
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
Read Also: Anti-Hijab Protests In Iran: అట్టుడుకుతున్న ఇరాన్.. ప్రభుత్వ కాల్పుల్లో 50 మంది మృతి
మరోవైపు ఆలిండియా బార్ అసోసియేషన్( ఏఐబీఏ) ఎలాంటి ఆలస్యం లేకుండా పీఎఫ్ఐని త్వరగా నిషేధించాలని.. పీఎఫ్ఐ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం పీఎఫ్ఐని నిషేధించే ప్రక్రియ ప్రారంభం అయినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే పలు ప్రజా సంఘాల నుంచి కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించాలని కోరుతూ డిమాండ్లు వెల్లవెత్తుతున్నాయి.
ఇటీవల 15 రాష్ట్రాల్లో పీఎఫ్ఐ-ఎస్డీపీఐ నెట్వర్క్పై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఎన్ఐఏ అనేక మంది పీఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసింది. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎంఎస్ సలామ్ తో పాటు మొత్తం 106 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ, కేంద్ర బలగాల సహకారంలో వీరందరిని అదుపులోకి తీసుకుంది. కనీసం రాష్ట్రప్రభుత్వాలకు తెలియకుండా ఏకకాలంలో భారీ ఆపరేషన్ నిర్వహించింది ఎన్ఐఏ. ఈ దెబ్బతో పీఎఫ్ఐ వెన్నుముకను విరిచినట్లు అయింది. మరోవైపు ఖతార్, కువైట్, టర్కీ దేశాల నుంచి పీఎఫ్ఐకి నిధులు వస్తున్నాయి. కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా పీఎఫ్ఐ వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర హోం శాఖ స్వయంగా రంగంలోకి దిగింది. గతంలో సిమిని నిషేధించిన తర్వాత అందులోని కొంతమంది పీఎఫ్ఐలో పనిచేస్తున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!