Delhi High Court: ఉద్యోగం, జీతం ఉన్న మహిళలకు “భరణం” ఎందుకు..?
- ఉద్యోగం, జీతం ఉన్న మహిళకు ‘‘భరణం’’ అవసరం లేదు..
- విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: ఇటీవల విడాకులు, ‘‘భరణాల’’కు సంబంధించిన కేసులు ఎక్కువ అవుతున్నాయి. విడాకుల తర్వాత మహిళలు పెద్ద మొత్తంలో భరణాన్ని కోరుతున్న కేసులపై పలు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా, ఢిల్లీ హైకోర్టు కూడా కీలక ఒక భరణం కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భరణం అనేది ఒక సామాజిక న్యాయం మాత్రమే అని, ఇది భాగస్వామి ఆర్థికంగా బలపడేందుకు , ఆర్థిక సమానత్వం కోసం ఉపయోగించే సాధనం కాదు’’ అని జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్లో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.
‘‘పిటిషనర్ ఆర్థికంగా, స్వయం సమృద్ధిగా, స్వతంత్రంగా సంపాదించుకునే సత్తా ఉన్న చోట భరణం ఇవ్వడానికి సెక్షన్ 25(హిందూ వివాహ చట్టం) కింద న్యాయపరమైన విచక్షణను ఉపయోగించలేము. ఆర్థికంగా స్వయం సమృద్ధి గల వ్యక్తి భరణం కోరడం సమంజసం కాదు. భరణం అనేది బాధితుడికి అవసరం ఉన్నపుడే ఇవ్వాలి.’’ అని చెప్పింది. ఉద్యోగం, జీతం, ఆర్థిక స్థితి బాగున్నవారు భరణం కోరడానికి అర్హులు కాదని కోర్టు తన తీర్పు ద్వారా చెప్పింది.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
క్రూరత్వం కారణంగా ఒక మహిళకు శాశ్వత భరణం నిరాకరించి, ఆమె భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. న్యాయవాదిగా పనిచేస్తున్న భర్త, గ్రూప్-ఏ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్(IRTS) అధికారి అయిన భార్య 2010 జనవరిలో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన 14 నెలల్లోపే వారు విడిపోయారు.
Read Also: Deputy CM Pawan: ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు.. పవన్ చొరవతోనే గడువు పొడిగించిన కేంద్రం
భార్య తనపై మానసిక, శారీరకంగా క్రూరంగా ప్రవర్తించిందని, తిడుతూ, అవమానకరమైన మెసేజులు పంపిందని, వృత్తిపరమైన, సామాజిక వర్గాల్లో అవమానించిందని భర్త ఆరోపించాడు. అయితే, భార్య వీటన్నింటిని తిరస్కరిస్తూ, భర్తే తనపై క్రూరంగా ప్రవర్తించాడని అభియోగాలు మోపింది. విడాకులకు అంగీకరించడానికి భార్య ఆర్థిక పరిష్కారంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు వివాహాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని భార్యనే స్వయంగా అంగీకరించింది.
ఆర్థికంగా లాభపడాలనే కోణం ఈ కేసులో స్పష్టంగా కనపిస్తోందని, ఆమె భరణం వెనక ఆర్థిక ఉద్దేశం ఉందని కోర్టు భావించింది. హైకోర్టు మహిళకు మంచి ఉద్యోగం ఉందని, పిల్లలు లేరని, ఆమె ఆర్థికంగా స్వతంత్రంగా ఉందని గుర్తించింది. దీనికి తోడు భార్య భర్త తల్లిని, భర్తను అవమానించిట్లు తేలింది. దీంతో సదరు మహిళకు భరణం అవసరం లేదని, ఆమె ఆర్థిక అవసరాలే లేవని ఆధారాలతో రుజువైందని, అందుకే భరణాన్ని మంజూరు చేయలేమని హైకోర్టు తీర్పు చెప్పింది.
గతంలో 2024లో ఒక మహిళ రూ. 12 కోట్లు, ముంబయిలో ఇళ్లు, బీఎండబ్ల్యూ కారు కావాలని కోరినప్పుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమె చదువుకుంది, సంపాదించుకుంటుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెరుగుతున్న భరణాల కేసులకు సంబంధించి కీలకంగా నిలిచింది.
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!