Delhi Flu: పెరుగుతున్న ఫ్లూ బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది.
ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇండియాలో 2400కి పైగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. మాస్క్ నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి. మాస్క్ లేకుండా తిరిగితే జరిమానాలు వేయాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఫ్లూ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం వద్దంటున్నారు డాక్టర్లు. ఈతరహా లక్షణాలు మూడు రోజులకు మించి కొనసాగితే కనుక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, అతిసారం, తీవ్ర బలహీనత, మగతగా ఉండడం, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గడం ఇవన్నీ మూడు రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలనేది సూచించారు.
ఆలస్యం చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న కేసులు గత వారం రోజుల్లో 30 శాతం పెరిగినట్లు తెలిపారు. గత వారం రోజుల్లో ఓపీకి వస్తున్న రోగుల్లో 40 శాతం మందిలో ఇన్ ఫ్లూయెంజా తరహా అనారోగ్య లక్షణాలు ఉంటున్నాయని ప్రముఖ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టినా వివిధ లక్షణాలు మాత్రం అలాగే వున్నాయంటున్నారు వైద్యులు. జ్వరం, దగ్గు, డయేరియా ఇతర లక్షణాలు కనిపించి రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతున్నాయి. అయినా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
Read Also: Bomb Blast: ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్ర దాడి.. 33 మంది మృతి.. 43 మందికి తీవ్రగాయాలు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!