దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక అమ్మాయిపై బిల్డర్ దాడి చేయడంతో బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Boyfriend Kills Woman: 20 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన బాయ్ఫ్రెండ్..
ఢిల్లీలోని కిరారీ ప్రాంతంలో జూలై 25న ఆస్తి వివాదం సందర్భంగా అమ్మాయిని బిల్డర్ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె ఆరడుడుల ఎత్తు నుంచి కిందపడి పోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. బిల్డర్తో అమ్మాయికి ఆస్తి వివాదం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు బిల్డర్పై అమన్ విహార్ పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. బిల్డర్ ఇంకా పరారీలో ఉన్నాడని.. అతనిని కనుగొని అరెస్టు చేయడానికి అనేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Paris Olympics 2024: ఒలింపిక్స్ బరిలో మహిళా ఎమ్మెల్యే..పతకం ఖాయమని ధీమా!