Delhi Accident Case: అసలు ట్విస్ట్ అంటే ఇది.. డ్రగ్స్ కేసులో అంజలి ఫ్రెండ్ అరెస్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Accident Case Eyewitness Nidhi Sas Arrested In Drug Smuggling Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ రోడ్డు ప్రమాదం కేసులో.. రోజుకో ఊహించని పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ప్రమాదంలో అత్యంత ఘోరంగా మృతి చెందిన అంజలి.. ఆరోజు రాత్రి ఒంటరిగానే ప్రయాణిస్తుందని తొలుత అనుకున్నారు. కానీ.. ఆమెతో పాటు నిధి అనే స్నేహితురాలు కూడా ఉందని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు తేల్చాయి. ఆమె ఆచూకీ కనుగొని సీన్లోకి తీసుకురాగా.. అంజలి మద్యం సేవించిందని నిధి కుండబద్దలు కొట్టింది. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్లో మాత్రం అంజలి మద్యం సేవించలేదని తేలింది. ఇదే సమయంలో నిధి ఎవరో తమకు తెలియదంటూ.. అంజలి కుటుంబ సభ్యులు బాంబ్ పేల్చారు.
Yash: మీ ఎదురు చూపుకి న్యాయం చేస్తాను… వెయిట్ చెయ్యండి…
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇలా త్రిల్లర్ సినిమాకి మంచి ట్విస్టులతో సాగుతున్న ఈ కేసులో.. తాజాగా మరో దిమ్మతిరిగే ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నిధి వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా.. ఆమె 2020లోనే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు తేలింది. 2020 డిసెంబర్ 6వ తేదీన తెలంగాణ నుంచి డ్రగ్స్ తరలిస్తూ.. ఆగ్రా రైల్వే స్టేషన్లో నిధి అడ్డంగా దొరికిపోయింది. ఆమెతో పాటు సమీర్, రవి అనే ఇద్దరు యువకులు సైతం అరెస్ట్ అయ్యారు. దీంతో.. నిధిపై పోలీసులు మరింత నిఘా పెంచారు. మరోవైపు.. ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో నిధి అరెస్ట్ అయినట్టు వార్తలు రాగా, కేవలం విచారణ కోసమే ఆమెని పోలీస్ స్టేషన్కు పిలిపించామని ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేసు నుంచి అయితే నిధి సేఫ్ కానీ, లేటెస్ట్గా తెరమీదకి వచ్చిన డ్రగ్స్ కేసులోనే ఆమెకి ఏమైనా చుక్కెదురు కావొచ్చు.
Robbery : రాజధానిలో బార్ ఓనర్ పై దాడి.. రూ.2కోట్లు దోపిడీ
కాగా.. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన సుల్తాన్పురి సమీపంలో అంజలి స్కూటీని ఢీకొట్టిన కారు, ఆమెను 12 కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో తప్పుడు సమాచారం అందించిన ఆరో నిందితుడు ఆశుతోష్ని సైతం అరెస్ట్ చేశారు. తొలుత ఈ కేసులో దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్లను అరెస్టు చేశారు. వీళ్లు ఆశుతోష్ నుంచి అప్పుగా తీసుకున్న కారును నడిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఐదుగురు పూటుగా మద్యం సేవించారు. ఆశుతోష్, ఆంకుష్ ఖన్నా కలిసి నిందితులైన తమ స్నేహితుల్ని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో, వాళ్లని అరెస్ట్ చేశారు. మొత్తం 18 పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!