Haryana: పంచకులలో ఘోరం.. కారులో ఏడుగురి మృతదేహాలు కలకలం
- హర్యానాలోని పంచకులలో ఘోరం
- కారులో ఏడుగురి మృతదేహాలు కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు కారులో లభ్యమయ్యాయి. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: వైఎస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా!
Also Read
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
మృతుడు డెహ్రాడూన్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ మిట్టల్ (42)గా గుర్తించారు. భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు చిన్నారులు మృతుల్లో ఉన్నారు. బాగేశ్వర్ ధామ్లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమానికి కుటుంబమంతా పంచకులకు వెళ్లింది. అనంతరం తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి పంచకులలోని సెక్టార్ 27లో ఆపి ఉంచిన కారులో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు గమనించి అప్రమత్తం అయ్యారు. వెంటనే హెల్ప్లైన్ 112కు ఫోన్ చేశారు. అనంతరం పోలీస్ బృందాలు వచ్చి చూసేసరికి కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడుగురు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Tragedy : పటాన్ చెరులో విషాదం.. భవనం నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి
ఇక కారులో ఒక సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. అందులోని విషయాలను పోలీసులు బహిర్గతం చేయలేదు. కానీ భారీ అప్పులు ఉండడమే కారణం అని రాసి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే.. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేయడానికి బంధువులను సంప్రదిస్తున్నట్లు పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్ తెలిపారు. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఆరుగురిని ఓజాస్ ఆస్పత్రికి తరలించామని.. ఇంకొకరిని సివిల్ ఆస్పత్రికి తరలించామని.. కానీ అందరూ మరణించినట్లు వైద్యులు చెప్పారన్నారు. ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. వాహనం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు, క్రైమ్ సీన్ బృందాలు నమూనాలు సేకరించాయని చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రైవేటు ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు చెప్పారు. ఒకేసారి కుటుంబమంతా చనిపోవడంతో డెహ్రాడూన్లోనూ.. పంచకులలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు్న్నారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!