Booster Dose: బూస్టర్ డోస్పై కేంద్రం కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ రూపాల్లో విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ పెద్ద సంఖ్యలో తీసుకున్నా.. బూస్టర్ డోస్ వేసుకోవడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపడంలేనట్టుగా తెలుస్తోంది.. అయితే, దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా వీలైనంత తొందరగా బూస్టర్ డోసులు తీసుకోవాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సూచించారు. ముందుగా తీసుకున్న వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తగ్గిపోతుండటంతో వీలైనంత తొందరగా ప్రికాషనరీ డోసు తీసుకోవాలని స్పష్టం చేశారు డాక్టర్ ఎన్కే అరోరా..
Read Also: LPG Cylinder Price: గుడ్న్యూస్.. రూ.91.5 తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
వివిధ రకాల వైరస్లతోపాటు కొవిడ్-19 కూడా వ్యాప్తిలో ఉందని…. అదృష్టవశాత్తూ అది ప్రభావాన్ని చూపించడంలేదన్నారు. అయినప్పటికీ కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్ తీసుకోని వారేనని ఎన్కే అరోరా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించిన డాక్టర్ ఎన్కే అరోరా.. భవిష్యత్తులో మన ఆరోగ్యానికి అది ఇన్సూరెన్స్గా పనిచేస్తాయని అన్నారు. కాగా, భారత్లో మరోసారి భారీ సంఖ్యలో నమోదవుతూ వచ్చిన రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య.. 20 వేలకు పైగా నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల, ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, సిటీ ఆసుపత్రులలో కోవిడ్ -19 రోగులలో 90 శాతం మందికి రెట్టింపు టీకాలు వేయబడ్డాయి మరియు 10 శాతం మంది మాత్రమే ముందు జాగ్రత్త మోతాదు తీసుకున్నారని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, బూస్టర్ డోస్లకు అర్హత పొందిన మొదటి సమూహం వారి వయస్సు లేదా పనిని బట్టి ఎక్కువ ప్రమాదం ఉందని అంచనా వేయబడింది. ఇక, భారతదేశంలో ఇప్పటికే కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క 100 మిలియన్లకు పైగా బూస్టర్ డోస్లను అందించింది. . భారతదేశం జనవరి 10 నుండి బూస్టర్ మోతాదును అందించడం ప్రారంభించింది. అయితే, ఇటీవలి నివేదిక ప్రకారం, 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మరియు అర్హత ఉన్న జనాభాలో కేవలం 12 శాతం మంది మాత్రమే ఈ రోజు వరకు కోవిడ్-19 టీకా యొక్క ముందు జాగ్రత్త మోతాదును పొందారు.
తాజావార్తలు
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!