Booster Dose: బూస్టర్ డోస్పై కేంద్రం కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ రూపాల్లో విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ పెద్ద సంఖ్యలో తీసుకున్నా.. బూస్టర్ డోస్ వేసుకోవడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపడంలేనట్టుగా తెలుస్తోంది.. అయితే, దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా వీలైనంత తొందరగా బూస్టర్ డోసులు తీసుకోవాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సూచించారు. ముందుగా తీసుకున్న వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తగ్గిపోతుండటంతో వీలైనంత తొందరగా ప్రికాషనరీ డోసు తీసుకోవాలని స్పష్టం చేశారు డాక్టర్ ఎన్కే అరోరా..
Read Also: LPG Cylinder Price: గుడ్న్యూస్.. రూ.91.5 తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
వివిధ రకాల వైరస్లతోపాటు కొవిడ్-19 కూడా వ్యాప్తిలో ఉందని…. అదృష్టవశాత్తూ అది ప్రభావాన్ని చూపించడంలేదన్నారు. అయినప్పటికీ కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్ తీసుకోని వారేనని ఎన్కే అరోరా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించిన డాక్టర్ ఎన్కే అరోరా.. భవిష్యత్తులో మన ఆరోగ్యానికి అది ఇన్సూరెన్స్గా పనిచేస్తాయని అన్నారు. కాగా, భారత్లో మరోసారి భారీ సంఖ్యలో నమోదవుతూ వచ్చిన రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య.. 20 వేలకు పైగా నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల, ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, సిటీ ఆసుపత్రులలో కోవిడ్ -19 రోగులలో 90 శాతం మందికి రెట్టింపు టీకాలు వేయబడ్డాయి మరియు 10 శాతం మంది మాత్రమే ముందు జాగ్రత్త మోతాదు తీసుకున్నారని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, బూస్టర్ డోస్లకు అర్హత పొందిన మొదటి సమూహం వారి వయస్సు లేదా పనిని బట్టి ఎక్కువ ప్రమాదం ఉందని అంచనా వేయబడింది. ఇక, భారతదేశంలో ఇప్పటికే కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క 100 మిలియన్లకు పైగా బూస్టర్ డోస్లను అందించింది. . భారతదేశం జనవరి 10 నుండి బూస్టర్ మోతాదును అందించడం ప్రారంభించింది. అయితే, ఇటీవలి నివేదిక ప్రకారం, 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మరియు అర్హత ఉన్న జనాభాలో కేవలం 12 శాతం మంది మాత్రమే ఈ రోజు వరకు కోవిడ్-19 టీకా యొక్క ముందు జాగ్రత్త మోతాదును పొందారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!