UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
- మాయవతి ఇంటికి వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు..
- అపాయింట్మెంట్ లేదని తిప్పి పంపిన భద్రతా సిబ్బంది..
- ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్..
- మాయవతితో పొత్తుకు ప్రయత్నిస్తున్నారంటూ ఊహాగానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపే కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, దళిత నాయకురాలిగా ఉన్న బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతితో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం రోజు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా లక్నోని మాయావతి ఇంటికి వెళ్లారు. అయితే, ముందస్తు అనుమతి లేకపోవడంతో ఆమె భద్రతా సిబ్బంది వారిని వెనక్కి పంపింది.
కాంగ్రెస్ నేతలు రాజేంద్ర పాల్ గౌతమ్, బారాబంకీ ఎంపీ తనుజ్ పునియాలు మంగళవారం ఆమె ఇంటికి చేరుకుని, మాయావతిని కలిసేందుకు తమను అనుమతించాలని అభ్యర్థించారు. కానీ వీరిని కలిసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. మాయావతి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, ఆమెను మర్యాదపూర్వకంగా కలిసేందుకు తాము వచ్చినట్లు వారిద్దరు చెప్పుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందేశాన్ని తెలియజేయడానికి వెళ్లినట్లు వస్తున్న వార్తల్ని వారు ఖండించారు.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. షోకాజ్ నోటీసులు జారీ చేుసింది. ఇది అధికారిక పర్యటన కాదని చెప్పింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ.. ఇలాంటి పర్యటనలు హైకమాండ్ ఆమోదంతోనే జరుగుతాయని, ముందుగానే నిర్ణయించబడుతాయని, ఈ పర్యటకు పార్టీ అనుమతి లేదని చెప్పారు.
2027 యూపీ ఎన్నికలకు ముందు మాయావతితో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాయావతితో జతకడితే ముస్లిం, దళిత, ఓబీసీ ఓట్లు చీలకుండా అడ్డుకోవచ్చని, ఇది బీజేపీ విజయాన్ని అడ్డుకోవచ్చనే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!