UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
- మాయవతి ఇంటికి వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు..
- అపాయింట్మెంట్ లేదని తిప్పి పంపిన భద్రతా సిబ్బంది..
- ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్..
- మాయవతితో పొత్తుకు ప్రయత్నిస్తున్నారంటూ ఊహాగానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపే కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, దళిత నాయకురాలిగా ఉన్న బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతితో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం రోజు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా లక్నోని మాయావతి ఇంటికి వెళ్లారు. అయితే, ముందస్తు అనుమతి లేకపోవడంతో ఆమె భద్రతా సిబ్బంది వారిని వెనక్కి పంపింది.
కాంగ్రెస్ నేతలు రాజేంద్ర పాల్ గౌతమ్, బారాబంకీ ఎంపీ తనుజ్ పునియాలు మంగళవారం ఆమె ఇంటికి చేరుకుని, మాయావతిని కలిసేందుకు తమను అనుమతించాలని అభ్యర్థించారు. కానీ వీరిని కలిసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. మాయావతి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, ఆమెను మర్యాదపూర్వకంగా కలిసేందుకు తాము వచ్చినట్లు వారిద్దరు చెప్పుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందేశాన్ని తెలియజేయడానికి వెళ్లినట్లు వస్తున్న వార్తల్ని వారు ఖండించారు.
Also Read
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. షోకాజ్ నోటీసులు జారీ చేుసింది. ఇది అధికారిక పర్యటన కాదని చెప్పింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ.. ఇలాంటి పర్యటనలు హైకమాండ్ ఆమోదంతోనే జరుగుతాయని, ముందుగానే నిర్ణయించబడుతాయని, ఈ పర్యటకు పార్టీ అనుమతి లేదని చెప్పారు.
2027 యూపీ ఎన్నికలకు ముందు మాయావతితో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాయావతితో జతకడితే ముస్లిం, దళిత, ఓబీసీ ఓట్లు చీలకుండా అడ్డుకోవచ్చని, ఇది బీజేపీ విజయాన్ని అడ్డుకోవచ్చనే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!