Congress: కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం… ఒకరికి రెండు సార్లు మాత్రమే రాజ్యసభ సీటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ తనను తాను నవీకరించుకోవాలనుకుంటోంది. ఇందుకు రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా జరుగుతున్న ‘నవ సంకల్ప్ శింతన్ శిబిర్’ వేదిక అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’ అనే పాలసీని తీసుకువచ్చింది. ఎంతటి పెద్ద నేతలైనా వారి కుటుంబాల వ్యక్తులకు టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. టికెట్ పొందాలంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసి ఉండాలనే నియమాలను తీసుకువచ్చింది. శింతన్ శిబిర్ తొలి రోజే సోనియాగాంధీ తన అధ్యక్ష ఉపన్యాసంలో కాంగ్రెస్ పార్టీ కొత్త రూపు సంతరించుకుంటుందని చెప్పకనే చెప్పారు. పార్టీ మీకు ఎంతో ఇచ్చింది… మీరు పార్టీకి ఇవ్వాల్సిన టైం వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ సీటుపై పరిమితిని విధించాలనే చర్చ జరుగుతోంది. ఒకరికి రెండుసార్లు మాత్రమే రాజ్యసభ సీటు కేటాయించాలనే దానిపై తీవ్రంగా చర్చిస్తున్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం కొంతమంది మాత్రమే పదవుల్లో ఉండకుండా, అందరికి అవకాశం ఇవ్వడానికి రాజ్యసభ సీటును రెండుసార్ల కన్నా ఎక్కువ సార్లు కేటాయించకూడదనే పరిమితి విధిస్తారని తెలుస్తోంది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇదిలా ఉంటే రేపు ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందుకు పలు తీర్మానాలు రానున్నాయి. రెండో రోజు శింతన్ శిబిర్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇంచార్జులు, పీసీసీ సభ్యులు, సీఎల్పీ లీడర్లతో సమావేశం అయ్యారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!