Car Parking Clash: కారు పార్కింగ్ విషయంలో గొడవ.. రెండు మతాల మధ్య ఘర్షణ
- యూపీలోని కాస్గంజ్ జిల్లాలో కారు పార్కింగ్ విషయంలో గొడవ..
- కారు పార్కింగ్ కోసం రెండు మతాల మధ్య కొనసాగిన ఘర్షణ..
- ఈ గొడవకు కారణమైన ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Parking Clash: ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలోని సోరాన్ పట్టణంలో కారు పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవ హింసాత్మకంగా మారింది. ఈ వివాదం రెండు మతాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. ఈ ఘర్షణకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి, కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, సోరాన్ పట్టణంలో రోడ్డు పక్కన కారు నిలిపి ఉంచడాన్ని ఒక వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. కారు తన దారికి అడ్డుగా ఉందని చెబుతూ, కారు యజమాని రియాజ్ అహ్మద్ను దానిని అక్కడి నుంచి తరలించమని కోరాడు. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం మరింత ముదిరడంతో కోపంతో అతడు ఆ వాహనాన్ని తన్నాడు. దీంతో క్షణాల్లో రెండు వైపుల సభ్యులు గుమిగూడటంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
Read Also: Kurnool Bus Accident: డ్రైవర్ అలా చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.. బాధితుడి ఆవేదన..
Also Read
- Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
ఇక, ఈ గొడవ జరగడంతో కొంత మంది స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి వస్తుండగా, అవతలి వైపు నుంచి కొందరు వారిపై దాడి చేశారని ఆరోపించారు. దీంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడం, కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఉద్రిక్తతలు తలెత్తకుండా నిరోధించడానికి సున్నితమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘర్షణలో గాయపడిన రియాజ్ అహ్మద్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి కాస్గంజ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ పోలీసుల బందోబస్తును ముమ్మరం చేశామని చెప్పారు. మేము అనేక ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు సోదాలు చేసి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయడంతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Astrology: మే 25th సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
-
Tollywood Percentage War: మెగాస్టార్ వద్దకు ఎగ్జిబిటర్ల పంచాయితీ?
-
Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
-
Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!