CM Yogi: మందిర్-మసీదు చర్చలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్.. వక్ఫ్ బోర్డు మాఫియాపై ఫైర్!
- మందిర్-మసీదు చర్చలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్..
- ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్ను వక్ఫ్ భూముల్లో నిర్వహిస్తున్నారు: ముస్లిం నేతలు
- ఇది వక్ఫ్ బోర్డు కాదని ల్యాండ్ మాఫియాల బోర్డు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: భారతదేశంలో అనేక దేవాలయాలు- మసీదుల వివాదాల పునరుద్ధరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..వారసత్వాన్ని తిరిగి పొందడం చెడ్డ విషయం కాదు… ఇప్పుడు సంభాల్లోని షాహీ జామా మసీదులో సనాతన్ రుజువు కనిపిస్తుంది అన్నారు. మహా కుంభమేళాకు ముందు ఓ జాతీయ టీవీ నిర్వహించిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతపరమైన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ ఆస్తి అనే వాదనలను కూడా ఈ సందర్భంగా తప్పుబట్టారు. ముస్లిం లీగ్ మనస్తత్వంతో భారతదేశం నడపబడదు అని పేర్కొన్నారు.
Read Also: Electricity Bill: ఓరి దేవుడా ఆ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు..
Also Read
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
అలాగే, ఆలయ-మసీదు వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజులకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక, 2013లో మారిషస్ ప్రధాని గంగానదిలో పుణ్యస్నానం చేసేందుకు భారత్కు వచ్చినప్పుడు కుంభోత్సవం సందర్భంగా అపరిశుభ్రత, నిర్వహణ లోపం చూసి వెనక్కి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. అయితే, అప్పుడు రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉండగా, అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. మళ్లీ, మారిషస్ ప్రధాని 2019లో వారణాసిని సందర్శించినప్పుడు.. వారు కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్రాజ్ను సందర్శించారు. ఆరేళ్లలో జరిగిన మార్పును చూసిన తర్వాత అతను తన కుటుంబంతో కలిసి సంగంలో పవిత్ర స్నానం చేశాడని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి వేళ.. పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్..
ఇక, డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేసిన కృషి వల్లే గంగానది పరిశుభ్రంగా మారిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే, ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్ను వక్ఫ్ భూముల్లో నిర్వహిస్తున్నారని ఓ మత పెద్ద చెప్పడంతో వక్ఫ్ బోర్డుపై యూపీ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇది వక్ఫ్ బోర్డు కాదని ల్యాండ్ మాఫియాల బోర్డు అని విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సాకుతో తీసుకున్న ప్రతి అంగుళం భూమిని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆదిత్యనాథ్ ఉద్ఘాటించారు. అలాగే, ‘వక్ఫ్’ అనే పదం ఎక్కడ కనిపించినా, ఆ భూమిని అసలు ఎవరి పేరు మీద రిజిస్టరు చేశారనే దానిపై విచారణ చేసి.. దానిని నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!