CM Yogi: మందిర్-మసీదు చర్చలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్.. వక్ఫ్ బోర్డు మాఫియాపై ఫైర్!
- మందిర్-మసీదు చర్చలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్..
- ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్ను వక్ఫ్ భూముల్లో నిర్వహిస్తున్నారు: ముస్లిం నేతలు
- ఇది వక్ఫ్ బోర్డు కాదని ల్యాండ్ మాఫియాల బోర్డు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: భారతదేశంలో అనేక దేవాలయాలు- మసీదుల వివాదాల పునరుద్ధరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..వారసత్వాన్ని తిరిగి పొందడం చెడ్డ విషయం కాదు… ఇప్పుడు సంభాల్లోని షాహీ జామా మసీదులో సనాతన్ రుజువు కనిపిస్తుంది అన్నారు. మహా కుంభమేళాకు ముందు ఓ జాతీయ టీవీ నిర్వహించిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతపరమైన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ ఆస్తి అనే వాదనలను కూడా ఈ సందర్భంగా తప్పుబట్టారు. ముస్లిం లీగ్ మనస్తత్వంతో భారతదేశం నడపబడదు అని పేర్కొన్నారు.
Read Also: Electricity Bill: ఓరి దేవుడా ఆ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు..
Also Read
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
అలాగే, ఆలయ-మసీదు వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజులకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక, 2013లో మారిషస్ ప్రధాని గంగానదిలో పుణ్యస్నానం చేసేందుకు భారత్కు వచ్చినప్పుడు కుంభోత్సవం సందర్భంగా అపరిశుభ్రత, నిర్వహణ లోపం చూసి వెనక్కి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. అయితే, అప్పుడు రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉండగా, అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. మళ్లీ, మారిషస్ ప్రధాని 2019లో వారణాసిని సందర్శించినప్పుడు.. వారు కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్రాజ్ను సందర్శించారు. ఆరేళ్లలో జరిగిన మార్పును చూసిన తర్వాత అతను తన కుటుంబంతో కలిసి సంగంలో పవిత్ర స్నానం చేశాడని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి వేళ.. పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్..
ఇక, డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేసిన కృషి వల్లే గంగానది పరిశుభ్రంగా మారిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే, ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్ను వక్ఫ్ భూముల్లో నిర్వహిస్తున్నారని ఓ మత పెద్ద చెప్పడంతో వక్ఫ్ బోర్డుపై యూపీ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇది వక్ఫ్ బోర్డు కాదని ల్యాండ్ మాఫియాల బోర్డు అని విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సాకుతో తీసుకున్న ప్రతి అంగుళం భూమిని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆదిత్యనాథ్ ఉద్ఘాటించారు. అలాగే, ‘వక్ఫ్’ అనే పదం ఎక్కడ కనిపించినా, ఆ భూమిని అసలు ఎవరి పేరు మీద రిజిస్టరు చేశారనే దానిపై విచారణ చేసి.. దానిని నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..