Nepal: నేపాల్ కరెన్సీపై భారత ప్రాంతాలు.. ముద్రించనున్న చైనా..
- నేపాల్ దుందుడుకు చర్య..
- భారత భూగాలను తమవిగా చెప్పుకునే ప్రయత్నం..
- ఆ దేశ కరెన్సీపై భారత్కి చెందిన మూడు ప్రాంతాలు..
- కరెన్సీని ముద్రించనున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ తన కరెన్సీ నోట్లపై భారత భూభాగాలను ముద్రించడం ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది. ఆ దేశ కరెన్సీని చైనా ముద్రించడం గమనార్హం. భారతదేశ భూభాగాలైన లింపియాధుర, లిపులేక్, కాలాపానీ ప్రాంతాలను తమ భాగాలుగా నేపాల్ చూపించుకునే ప్రయత్నం చేసింది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అయిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కొత్త 100 రూపాలయ నోట్లపై భారత భూభాగాలను ముద్రించింది. ఈ కాంట్రాక్టును చైనా కంపెనీకి ఇచ్చింది.
Read Also: KA Movie Review: క సినిమా రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా?
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలైన ఈ మూడు ప్రాంతాలను నేపాల్ తమవిగా చెప్పుకుంటోంది. దీనిపై గతంతో పెద్ద వివాదమే నడిచింది. జూన్ 18, 2020లో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను తమ భూభాగాలుగా చెబుతూ.. ఆ దేశం రాజ్యాంగాన్ని సవరించింది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. మరోసారి వీటిని నేపాల్ దాని కరెన్సీ నోట్లపై ముద్రించడం ద్వారా మరోసారి వివాదాన్ని రాజేసింది. ప్రస్తుతం ఈ మూడు భాగాలు కూడా భారతదేశ ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఈ నేపాల్ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్ని పొందింది. 300 మిలియన్ నేపాల్ రూపాలయ విలువైన రూ. 100 నోట్ల డిజైన్ని ప్రింట్ చేసి డెలివరీ చేయాల్సిందిగా చైనా కంపెనీని కోరింది. దీని ప్రింటింగ్ ఖర్చు సుమారు 8.99 మిలియన్ డాలర్లుగా ఉంటుందని రిపబ్లికా పేపర్ నివేదించింది. నేపాల్ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలైన సిక్కిం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లతో 1850 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?