Rafale jets: “రాఫెల్ జెట్”పై చైనా గూఢచర్యం, నలుగురు అరెస్ట్..
- రాఫెల్ జెట్ గురించి చైనా గూఢచర్యం..
- గ్రీస్లో నలుగురు చైనీయుల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rafale jets: జిత్తులమారి చైనా, ఎప్పటికప్పుడు వేరే దేశాల ఆయుధాలను కాపీ కొడుతూ మేడ్ ఇన్ చైనా ఆయుధాలను తయారు చేస్తుంటుంది. అయితే, తాజాగా జరిగిన సంఘటన చూస్తే మరోసారి అదే పనిలో ఆ దేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్రెంచ్ తయారీ రాఫెట్ ఫైటర్ జెట్ సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు చైనా జాతీయులను గ్రీస్ దేశంలో అరెస్ట్ అయ్యారు. గ్రీస్లోని తనగ్రాలో రాఫెల్ ఫైటల్ జెట్స్ ఫోటోలు తీసినందుకు, హెలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ(HAI) ఫెసిలిటీని చిత్రీకరించినందుకు అక్కడి అధికారులు వీరిని అరెస్ట్ చేశారు.
చైనాకు చెందిన నలుగురు వ్యక్తులు ఆ ప్రాంతంలోని సున్నితమైన సైనిక స్థావరాలను ఫోటో తీస్తున్నట్లు గుర్తించిన తర్వాత అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో గూఢచర్యం చేస్తు్న్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. వీరు తీసిన చిత్రాలను పరిశీలిస్తే రాఫెట్ ఫైటర్ జెట్ ఫోటోలు ప్రముఖంగా కనిపించాయి. పోలీసుల చెబుతున్న దాని ప్రకారం, వీరి వద్ద విస్తృతమైన సైనిక సమాచారానికి సంబంధించిన ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
Read Also: Russia: భారతీయులకు రష్యా బంఫర్ ఆఫర్.. 10 లక్షల మందికి ఉద్యోగాలు..?
ఇటీవల గ్రీస్-భారత్ సైనిక సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఆపరేషన్లో రాఫెట్ ఫైటర్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. అయితే, రాఫెట్ జెట్లను పాకిస్తాన్ కూల్చివేసినట్లు చైనా పత్రికలు తప్పుడు ప్రచారం చేశాయి. అయితే, ఇదంతా వట్టిదే అని ఆ తర్వాత తెలిసింది. ప్రస్తుతం, గ్రీస్లో అరెస్ట్ చేయబడిన వ్యక్తులు ప్రత్యేకంగా రాఫెట్ విమానాల ఫోటోలనే తీశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెట్ ఫైటర్ జెట్ల పనితీరుపై చైనా విష ప్రచారం చేసింది. పాకిస్తాన్ ఉపయోగించిన తమ సాంకేతికత అత్యుత్తమంగా పనిచేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. భారత్-పాక్ వివాద సమయంలో 1000 కంటే ఎక్కువ కొత్త సోషల్ మీడియా అకౌంట్లతో చైనా టెక్నాలజీని పొగుడుతూ ఒక కథనాన్ని ముందుకు తెచ్చింది. డసాల్ట్ ఏవియేషన్ ఇప్పటివరకు 533 రాఫెల్ జెట్లను విక్రయించింది, వాటిలో 323 ఈజిప్ట్, భారతదేశం, ఖతార్, గ్రీస్, క్రొయేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెర్బియా మరియు ఇండోనేషియాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!