Rafale jets: “రాఫెల్ జెట్”పై చైనా గూఢచర్యం, నలుగురు అరెస్ట్..
- రాఫెల్ జెట్ గురించి చైనా గూఢచర్యం..
- గ్రీస్లో నలుగురు చైనీయుల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rafale jets: జిత్తులమారి చైనా, ఎప్పటికప్పుడు వేరే దేశాల ఆయుధాలను కాపీ కొడుతూ మేడ్ ఇన్ చైనా ఆయుధాలను తయారు చేస్తుంటుంది. అయితే, తాజాగా జరిగిన సంఘటన చూస్తే మరోసారి అదే పనిలో ఆ దేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్రెంచ్ తయారీ రాఫెట్ ఫైటర్ జెట్ సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు చైనా జాతీయులను గ్రీస్ దేశంలో అరెస్ట్ అయ్యారు. గ్రీస్లోని తనగ్రాలో రాఫెల్ ఫైటల్ జెట్స్ ఫోటోలు తీసినందుకు, హెలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ(HAI) ఫెసిలిటీని చిత్రీకరించినందుకు అక్కడి అధికారులు వీరిని అరెస్ట్ చేశారు.
చైనాకు చెందిన నలుగురు వ్యక్తులు ఆ ప్రాంతంలోని సున్నితమైన సైనిక స్థావరాలను ఫోటో తీస్తున్నట్లు గుర్తించిన తర్వాత అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో గూఢచర్యం చేస్తు్న్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. వీరు తీసిన చిత్రాలను పరిశీలిస్తే రాఫెట్ ఫైటర్ జెట్ ఫోటోలు ప్రముఖంగా కనిపించాయి. పోలీసుల చెబుతున్న దాని ప్రకారం, వీరి వద్ద విస్తృతమైన సైనిక సమాచారానికి సంబంధించిన ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Russia: భారతీయులకు రష్యా బంఫర్ ఆఫర్.. 10 లక్షల మందికి ఉద్యోగాలు..?
ఇటీవల గ్రీస్-భారత్ సైనిక సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఆపరేషన్లో రాఫెట్ ఫైటర్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. అయితే, రాఫెట్ జెట్లను పాకిస్తాన్ కూల్చివేసినట్లు చైనా పత్రికలు తప్పుడు ప్రచారం చేశాయి. అయితే, ఇదంతా వట్టిదే అని ఆ తర్వాత తెలిసింది. ప్రస్తుతం, గ్రీస్లో అరెస్ట్ చేయబడిన వ్యక్తులు ప్రత్యేకంగా రాఫెట్ విమానాల ఫోటోలనే తీశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెట్ ఫైటర్ జెట్ల పనితీరుపై చైనా విష ప్రచారం చేసింది. పాకిస్తాన్ ఉపయోగించిన తమ సాంకేతికత అత్యుత్తమంగా పనిచేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. భారత్-పాక్ వివాద సమయంలో 1000 కంటే ఎక్కువ కొత్త సోషల్ మీడియా అకౌంట్లతో చైనా టెక్నాలజీని పొగుడుతూ ఒక కథనాన్ని ముందుకు తెచ్చింది. డసాల్ట్ ఏవియేషన్ ఇప్పటివరకు 533 రాఫెల్ జెట్లను విక్రయించింది, వాటిలో 323 ఈజిప్ట్, భారతదేశం, ఖతార్, గ్రీస్, క్రొయేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెర్బియా మరియు ఇండోనేషియాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!