Hydropower Dam: చైనా చేష్టలతో భారత్కు పొంచి ఉన్న మరో ముప్పు..
- ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ను నిర్మించేందుకు సిద్ధమైన చైనా..
- భారత్- చైనా సరిహద్దు వద్ద అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం!..
- ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా ఒకేసారి వాటర్ బాంబ్గా విడుదల చేసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydropower Dam: ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ను నిర్మించడానికి చైనా ఆమోదించింది. టిబెట్ తూర్పు అంచులో యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించబోతున్నట్లు అక్కడి న్యూస్ ఛానల్స్ లో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో డ్రాగన్ కంట్రీకి చెందిన పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ పేర్కొనింది. ప్రస్తుతం చైనాలో త్రీగోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్ గా ఉంది. అంటే కొత్తగా నిర్మించే జలాశయం సామర్థ్యం దానికి మూడురెట్లు అధికంగా ఉండనుందని సమాచారం.
Read Also: Potina Mahesh: కాపుల కోసం పోరాడవా?.. వంగవీటి రాధాపై పోతిన మహేష్ ఫైర్!
Also Read
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
కాగా, టిబెట్లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ మీదుగా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదీ జలాల ప్రవాహతీరు, పంపిణీ లాంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్-చైనా మధ్య ఇప్పటికే ఒప్పందం కొనసాగుతుంది. వర్షాకాలంలో ఈ నదికి భారీగా వరదలు వస్తాయి. బంగ్లాదేశ్లో తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంటుంది. అయితే, ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జల సంబంధిత విషయాల్ని చైనా- భారత్ పంచుకోవాల్సి ఉంటుంది.
Read Also: Delhi: ఢిల్లీ ఎన్నికలకు.. ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు..
అయితే, చైనా- భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్కు ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకున్నారు.. కానీ, చివరి సారిగా కుదిరిన ఒప్పందం 2023లో క్లోజ్ అయింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల ఆ తర్వాత కొత్త ఒప్పందం చేసుకోలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా రెడీ అవుతుండటం భారత్ ను కలవరపాటుకు గురి చేస్తుంది.
Read Also: AUS vs IND: ఐసీసీ కీలక నిర్ణయం.. కోహ్లీకి భారీ జరిమానా
ఇక, చైనా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు ప్రమాదం పొంచి ఉన్నట్లే. వేసవిలో బ్రహ్మపుత్ర నది నీటిని మళ్లించేందుకు బీజింగ్కు ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కునే ప్రమాదం ఉంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్రకి భారీగా వరదలు వస్తుంటాయి.. ఒకేసారి నీటిని కిందికి విడుదల చేస్తే.. దిగువనున్న ప్రాంతాలు ముంపుకు గురికానున్నాయి. ఈ ప్రాజెక్ట్ భారత్-చైనా సరిహద్దుకు కేవలం 30 కిలో మీటర్ల దూరంలోనే నిర్మిస్తున్నారు. దాంతో పాటు రక్షణ పరంగానూ భారత్కు అనేక సమస్యలు వస్తాయి. ఒక వేళ యుద్ధ పరిస్థితులు వస్తే.. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా ఒకేసారి వాటర్ బాంబ్గా ఉపయోగించే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!