Fake Bomb Threats: నకిలీ బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి కేంద్రం వార్నింగ్..
- నకిలీ బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్..
- సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Bomb Threats: దేశంలో గత 10 రోజులుగా విమానయాన రంగాన్ని నకిలీ బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి. 10 రోజుల్లో 250కి పైగా విమానాలు బెదిరింపులుకు గురయ్యాయి. డొమెస్టిన్తో సహా ఇంటర్నేషనల్ రూట్లలో నడిచే విమానాలపై ప్రభావం పడింది. ఈ నకిలీ బెదిరింపుల ఫలితంగా విమానయాన రంగం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చాలా వరకు ఈ నకిలీ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.
Read Also: IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
తాజాగా ఈ నకిలీ బెదిరింపులపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ని హెచ్చరించింది. శుక్రవారం ఒక సలహాలో.. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బూటకపు బాంబు బెదిరింపుల కారణంగా విమాన ప్రయాణికులు మరియు భద్రతా ఏజెన్సీలు ప్రభావితమయ్యాయని, ఇది విమానయాన సంస్థల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించిందని పేర్కొంది. ఇటువంటి బూటకపు బాంబు బెదిరింపులు, పెద్ద సంఖ్యలో పౌరులను ప్రభావితం చేస్తున్నప్పుడు, దేశ ఆర్థిక భద్రతను కూడా అస్థిరపరుస్తాయని చెప్పింది.
ఈ నకిలీ బాంబు బెదిరింపుల మేసేజ్లను సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్, రీషేరింగ్, రీపోస్టింగ్, రీట్వీటింగ్ చేస్తున్నట్లు గమనించామని కేంద్రం చెప్పింది. ఇలాంటి తప్పుడు బెదిరింపులు పబ్లిక్ ఆర్డర్, ఎయిర్ లైన్స్ సేవలు, విమానయాన ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని చెప్పింది. పబ్లిక్ ఆర్డర్ మరియు సెక్యూరిటీని ప్రభావితం చేసే తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT చట్టం), 2000 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (IT రూల్స్), 2021 ప్రకారం తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్లాట్ఫారమ్లకు ఉందని మంత్రిత్వ శాఖ ఎత్తి చూపింది. అటువంటి “చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు” సమాచారాన్ని పోస్ట్ చేయడం మరియు భాగస్వామ్యం చేయడాన్ని ఆపాలని ప్లాట్ఫారమ్లను కోరింది
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!