Fake Bomb Threats: నకిలీ బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి కేంద్రం వార్నింగ్..
- నకిలీ బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్..
- సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Bomb Threats: దేశంలో గత 10 రోజులుగా విమానయాన రంగాన్ని నకిలీ బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి. 10 రోజుల్లో 250కి పైగా విమానాలు బెదిరింపులుకు గురయ్యాయి. డొమెస్టిన్తో సహా ఇంటర్నేషనల్ రూట్లలో నడిచే విమానాలపై ప్రభావం పడింది. ఈ నకిలీ బెదిరింపుల ఫలితంగా విమానయాన రంగం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చాలా వరకు ఈ నకిలీ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.
Read Also: IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
తాజాగా ఈ నకిలీ బెదిరింపులపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ని హెచ్చరించింది. శుక్రవారం ఒక సలహాలో.. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బూటకపు బాంబు బెదిరింపుల కారణంగా విమాన ప్రయాణికులు మరియు భద్రతా ఏజెన్సీలు ప్రభావితమయ్యాయని, ఇది విమానయాన సంస్థల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించిందని పేర్కొంది. ఇటువంటి బూటకపు బాంబు బెదిరింపులు, పెద్ద సంఖ్యలో పౌరులను ప్రభావితం చేస్తున్నప్పుడు, దేశ ఆర్థిక భద్రతను కూడా అస్థిరపరుస్తాయని చెప్పింది.
ఈ నకిలీ బాంబు బెదిరింపుల మేసేజ్లను సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్, రీషేరింగ్, రీపోస్టింగ్, రీట్వీటింగ్ చేస్తున్నట్లు గమనించామని కేంద్రం చెప్పింది. ఇలాంటి తప్పుడు బెదిరింపులు పబ్లిక్ ఆర్డర్, ఎయిర్ లైన్స్ సేవలు, విమానయాన ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని చెప్పింది. పబ్లిక్ ఆర్డర్ మరియు సెక్యూరిటీని ప్రభావితం చేసే తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT చట్టం), 2000 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (IT రూల్స్), 2021 ప్రకారం తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్లాట్ఫారమ్లకు ఉందని మంత్రిత్వ శాఖ ఎత్తి చూపింది. అటువంటి “చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు” సమాచారాన్ని పోస్ట్ చేయడం మరియు భాగస్వామ్యం చేయడాన్ని ఆపాలని ప్లాట్ఫారమ్లను కోరింది
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?