Fake Bomb Threats: నకిలీ బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి కేంద్రం వార్నింగ్..
- నకిలీ బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్..
- సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Bomb Threats: దేశంలో గత 10 రోజులుగా విమానయాన రంగాన్ని నకిలీ బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి. 10 రోజుల్లో 250కి పైగా విమానాలు బెదిరింపులుకు గురయ్యాయి. డొమెస్టిన్తో సహా ఇంటర్నేషనల్ రూట్లలో నడిచే విమానాలపై ప్రభావం పడింది. ఈ నకిలీ బెదిరింపుల ఫలితంగా విమానయాన రంగం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చాలా వరకు ఈ నకిలీ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.
Read Also: IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
తాజాగా ఈ నకిలీ బెదిరింపులపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ని హెచ్చరించింది. శుక్రవారం ఒక సలహాలో.. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బూటకపు బాంబు బెదిరింపుల కారణంగా విమాన ప్రయాణికులు మరియు భద్రతా ఏజెన్సీలు ప్రభావితమయ్యాయని, ఇది విమానయాన సంస్థల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించిందని పేర్కొంది. ఇటువంటి బూటకపు బాంబు బెదిరింపులు, పెద్ద సంఖ్యలో పౌరులను ప్రభావితం చేస్తున్నప్పుడు, దేశ ఆర్థిక భద్రతను కూడా అస్థిరపరుస్తాయని చెప్పింది.
ఈ నకిలీ బాంబు బెదిరింపుల మేసేజ్లను సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్, రీషేరింగ్, రీపోస్టింగ్, రీట్వీటింగ్ చేస్తున్నట్లు గమనించామని కేంద్రం చెప్పింది. ఇలాంటి తప్పుడు బెదిరింపులు పబ్లిక్ ఆర్డర్, ఎయిర్ లైన్స్ సేవలు, విమానయాన ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని చెప్పింది. పబ్లిక్ ఆర్డర్ మరియు సెక్యూరిటీని ప్రభావితం చేసే తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT చట్టం), 2000 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (IT రూల్స్), 2021 ప్రకారం తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్లాట్ఫారమ్లకు ఉందని మంత్రిత్వ శాఖ ఎత్తి చూపింది. అటువంటి “చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు” సమాచారాన్ని పోస్ట్ చేయడం మరియు భాగస్వామ్యం చేయడాన్ని ఆపాలని ప్లాట్ఫారమ్లను కోరింది
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!