Fake Bomb Threats: నకిలీ బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి కేంద్రం వార్నింగ్..
- నకిలీ బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్..
- సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Bomb Threats: దేశంలో గత 10 రోజులుగా విమానయాన రంగాన్ని నకిలీ బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి. 10 రోజుల్లో 250కి పైగా విమానాలు బెదిరింపులుకు గురయ్యాయి. డొమెస్టిన్తో సహా ఇంటర్నేషనల్ రూట్లలో నడిచే విమానాలపై ప్రభావం పడింది. ఈ నకిలీ బెదిరింపుల ఫలితంగా విమానయాన రంగం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చాలా వరకు ఈ నకిలీ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.
Read Also: IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!
Also Read
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
తాజాగా ఈ నకిలీ బెదిరింపులపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ని హెచ్చరించింది. శుక్రవారం ఒక సలహాలో.. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బూటకపు బాంబు బెదిరింపుల కారణంగా విమాన ప్రయాణికులు మరియు భద్రతా ఏజెన్సీలు ప్రభావితమయ్యాయని, ఇది విమానయాన సంస్థల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించిందని పేర్కొంది. ఇటువంటి బూటకపు బాంబు బెదిరింపులు, పెద్ద సంఖ్యలో పౌరులను ప్రభావితం చేస్తున్నప్పుడు, దేశ ఆర్థిక భద్రతను కూడా అస్థిరపరుస్తాయని చెప్పింది.
ఈ నకిలీ బాంబు బెదిరింపుల మేసేజ్లను సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్, రీషేరింగ్, రీపోస్టింగ్, రీట్వీటింగ్ చేస్తున్నట్లు గమనించామని కేంద్రం చెప్పింది. ఇలాంటి తప్పుడు బెదిరింపులు పబ్లిక్ ఆర్డర్, ఎయిర్ లైన్స్ సేవలు, విమానయాన ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని చెప్పింది. పబ్లిక్ ఆర్డర్ మరియు సెక్యూరిటీని ప్రభావితం చేసే తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT చట్టం), 2000 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (IT రూల్స్), 2021 ప్రకారం తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్లాట్ఫారమ్లకు ఉందని మంత్రిత్వ శాఖ ఎత్తి చూపింది. అటువంటి “చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు” సమాచారాన్ని పోస్ట్ చేయడం మరియు భాగస్వామ్యం చేయడాన్ని ఆపాలని ప్లాట్ఫారమ్లను కోరింది
తాజావార్తలు
-
SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
-
Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!