విజృంభిస్తోన్న కొత్త వేరియంట్… పది రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు…ఊహించని విధంగా పెరిగిపోతున్నాయ్. ఒమిక్రాన్ పాజిటివ్లు…450కి చేరువయ్యాయ్. రిస్క్ దేశాల నుంచే కాకుండా…నాన్ రిస్స్దేశాల నుంచి వచ్చిన వారిలోనూ ఒమిక్రాన్ బయటపడుతోంది. మరోవైపు పదిరాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది.
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్ పాకగా.. 450కి చేరువయ్యాయ్. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో 79, గుజరాత్లో 43 కేసులు నమోదయ్యాయి. తాజాగా రాజస్థాన్లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు.
Also Read
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఒమిక్రాన్, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరం, కర్ణాటక, బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3 నుంచి 5 రోజుల పాటు ఉండనున్నాయి. కొవిడ్ పరీక్షలు, కరోనా నిబంధనల అమలు వంటి అంశాలపై రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేయనున్నాయి. దీంతో పాటు వ్యాక్సినేషన్ వృద్ధి, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదించనున్నాయ్.
వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా…వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అసోం ప్రభుత్వం…రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది. ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే నూతన సంవత్సర వేడుకలకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటికే హర్యానా, యూపీ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయ్.
తాజావార్తలు
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!