MSP: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు..
- రైతులకు కేంద్రం గుడ్న్యూస్..
- 14 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంపు..
- వరి క్వింటాకి రూ. 2300..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి, రాగి, మొక్కజొన్న, జొన్న, పత్తితో సహా 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరి కనీస మద్దతు ధరను రూ. 117 పెంచినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ మద్దతు ధర పెంపుతో క్వింటా వరి ధర రూ. 2300కి చేరుతుంది. పంటల ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు ఎంఎస్పీని కేంద్రం ఆమోదించింది. నూనెగింజలు, పప్పుధాన్యాలకు అత్యధికంగా మద్దతు ధరను పెంచారు.
Read Also: Earth Core: భూమి అంతర్గత కోర్ భ్రమణ వేగం తగ్గింది.. ఎలాంటి ప్రభావం ఉండబోతోంది..?
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
కొత్త ధరల ప్రకారం క్వింటాల్కి.. కందిపప్పుకు రూ. 7500, మినుములకు రూ. 7400, పెసరకు రూ. 8682, వేరు శనిగకు రూ. 6783, పత్తికి రూ. 7121, జొన్నకు రూ. 3371గా ఉంది. తాజా నిర్ణయంతో రైతులు దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల ఎంఎస్పీ అదనంగా లభిస్తుందని, గత సీజన్తో పోలిస్తే ఇది రూ. 35,000 ఎక్కువ అని మంత్రి చెప్పారు. ఇదే విధంగా క్వింటా చొప్పున రాగులకు రూ. 4,290, సజ్జలకు రూ. 2,625, మొక్కజొన్న రూ.2,225 వద్ద రేట్లను నిర్ణయించారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
తాజావార్తలు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!