సోషల్ మీడియా ఖాతాల హ్యాక్పై కేంద్రం సీరియస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల హ్యాక్పై కేంద్రం సీరియస్గా ఉందా ? సామాజిక మాధ్యమాల హ్యాకింగ్పై…యాంటీ సైబర్ క్రైమ్ బృందంతో…దర్యాప్తు చేయించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీ పిల్లల ఖాతాలను…సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
తన పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను హ్యాక్ చేశారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజాలను నిగ్గు తేల్చేందుకు అడ్వాన్స్డ్ యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్తో దర్యాప్తు చేయించనున్నట్లు సమాచారం. హ్యాకింగ్ గురించి ప్రియాంక అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, కేంద్రమే సొంతంగా దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది. ఈ టీమ్ అడ్వాన్స్డ్ ల్యాబ్ను నడుపుతోంది. అది హ్యాకర్లను గుర్తించడమే కాకుండా, సైబర్ దాడులను నివారిస్తుంది.
Also Read
కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకోగా…తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పిల్లలు ఖాతాలను హ్యాక్ చేశారు. కుమార్తె మిరాయా వాద్రా , కుమారుడు రైహాన్ వాద్రా…ఇన్స్టా గ్రాం ఖాతాలు… ఫోన్లు హ్యాక్ అయినట్టు ప్రియాంక గాంధీ స్వయంగా వెల్లడించారు. ప్రభుత్వం తన పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను హ్యాక్ చేస్తోందని… వాళ్లకు వేరే పనిలేదా? అని ప్రశ్నించారు ప్రియాంకా గాంధీ.
ఇటీవల ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని… సంభాషణలు రికార్డు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆఫీస్ ఫోన్ల సంభాషణలు వింటున్నారన్న అఖిలేశ్… సాయంత్రం పూట సీఎం కూడా తమ పార్టీ నేతల సంభాషణలు వింటున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?