Gyanesh Kumar: బీహార్లో ఈసారి కొత్త విధానం.. బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయో చెప్పిన సీఈసీ
- బీహార్లో ఈసారి కొత్త విధానం
- బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయో చెప్పిన సీఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఈసీ బృందం పాట్నా వచ్చింది. వివిధ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇక ఎన్నికల నిర్వహిణపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నవంబర్ 22కు ముందే ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని.. ఇక ప్రతి బూత్లో 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉంటారని తెలిపారు. ఇక అన్ని పోలింగ్ బూత్ల్లో మొబైల్ డిపాజిట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈవీఎంలపై బ్యాలెట్ పత్రాలు నలుపు, తెలుపు రంగులో ఉంటాయని.. ఇవి గుర్తించడం కష్టం.. అందువల్ల ఈసారి సీరియల్ నెంబర్తో పాటు అభ్యర్థుల ఫొటోలు రంగులో ఉంటాయని తెలిపారు.
ఇక చట్టాల ఆధారంగా జైల్లో ఉన్న వ్యక్తుల నామినేషన్లు దాఖలు చేసే విధానంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆదర్శప్రాయమైన ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బీహార్ బూత్ స్థాయి అధికారులు కృషి చేశారంటూ ప్రశంసించారు.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ఇది కూడా చదవండి: Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈలోపే ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ భావిస్తోంది. ఇక దీపావళి తర్వాత బీహార్లో అత్యంత గ్రాండ్గా జరుపుకునే ఉత్సవం ఛత్. ఈ పండుగ అక్టోబర్ 25 నుంచి 28 వరకు జరుగుతుంది. ఈ ఛత్ పండుగ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా బీహారీయులంతా సొంత ఇళ్లకు వచ్చేస్తారు. ఏ రాష్ట్రంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా కచ్చితంగా ఛత్ పండుగ కోసం తరలివస్తారు. వచ్చిన వారు తిరిగి వెళ్లిపోకముందే ఎన్నికల ప్రక్రియను ముగించేయాలని అన్ని పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎక్కువ విడతల్లో కాకుండా.. తక్కువ సమయంలోనే ఎన్నికలు ముగించాలని.. దీని కారణాన ప్రచార భారం కూడా తగ్గుతుందని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారంలోనే ఎన్నికల నిర్వహించాలని ఈసీ కూడా భావిస్తున్నట్లు సమాచారం. 2020లో కోవిడ్ సమయంలో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అప్పటిలాగా కాకుండా ఈసారి ఒకటి, రెండు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను ముగించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Suryakumar Yadav Regret: నా కోరిక ఎప్పటికీ నెరవేరదు.. తీవ్రంగా చింతిస్తుంటా!
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 2 షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) 38 షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) కోసం రిజర్వు చేయబడ్డాయని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తయిందని చెప్పారు. అలాగే బూత్ స్థాయి శిక్షణ కూడా నిర్వహించినట్లు చెప్పారు. తొలిసారిగా 700 మంది బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చిందని… ఎన్నికల సంసిద్ధతను సీఈసీ వ్యక్తం చేశారు. వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి
- Tags
తాజావార్తలు
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!