CDS Anil Chauhan: చైనా యుద్ధంలో ఎయిర్ఫోర్స్ దాడికి అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు..
- 1962 చైనా వార్లో ఎయిర్ఫోర్స్ వాడుంటే వేరేలా ఉండేది..
- అప్పటి ప్రభుత్వం ఎయిర్ఫోర్స్ దాడికి అనుమతి ఇవ్వలేదు..
- సంచలన వ్యాఖ్యలు చేసిన సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CDS Anil Chauhan: త్రివిధ దళాధిపతి, సీడీఎస్ అనిల్ చౌహాన్ 1962 ఇండియా-చైనా యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో భారత వైమానిక దళాన్ని ఉపయోగించి ఉంటే కథ వేరుగా ఉండేదని అన్నారు. వైమానిక దళం ఉపయోగించడం వల్ల చైనా దాడి తగ్గేదని చెప్పారు. వైమానిక దళాన్ని ఉపయోగించడం ఉద్రిక్తతల్ని పెంచడం అవుతుందని కొందరు భావిస్తారు, కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో అలా జరగలేదని నిరూపితం అయిందని అనిల్ చౌహాన్ బుధవారం అన్నారు.
63 ఏళ్ల క్రితం చైనాతో జరిగిన యుద్ధం గురించి ఆయన మాట్లాడుతూ.. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లకు పార్వర్డ్ పాలసీని ఒకే విధంగా వర్తించడం తప్పు అవుతుందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా యుద్ధాల ముఖ చిత్రం మారిపోయిందని, భద్రతా పరిస్థితులు, భౌగోళిక స్వరూపాలు, రాజకీయ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. పూణేలో దివంగత లెఫ్టినెంట్ జనరల్ SPP థోరాట్ ఆత్మకథ ‘‘రెవిల్లే టూ రిట్రీట్’’ విడుదల కార్యక్రమానికి సంబంధించి, వీడియో సందేశంలో అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చైనా-భారత యుద్ధానికి ముందు లెఫ్టినెంట్ జనరల్ థోరాట్ తూర్పు కమాండ్కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా ఉన్నారు.
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
Read Also: AP Politics : ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సూపర్ సిక్స్ పథకాలపై వేడివేడి వాదనలు
1962 ఎయిర్ ఫోర్స్ వాడితే గణనీయమైన ప్రయోజనం ఉండేదని సీడీఎస్ అన్నారు. అయితే, అప్పటి ప్రభుత్వం దీనికి అనుమతించలేదు, లెఫ్టినెంట్ జనరల్ థోరాట్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉపయోగించడంపై ఆలోచించారని అన్నారు. ఎయిర్ ఫోర్స్ ఉపయోగించడం వల్ల చైనా దాడిని పూర్తిగా నిరోధించకపోయినా, వారి దాడిని తగ్గించే అవకాశం ఉండేది, ఆ సమయంలో మన సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం దొరికేది అని అన్నారు. అయితే, ఆ రోజుల్లో వైమానిక దళాన్ని ఉపయోగించడం ఉద్రిక్తల్ని పెంచడంగా భావించే వారని, ఇది నిజం కాదని తాను భావిస్తు్న్నానని, ఆపరేషన్ సిందూర్ ఇందుకు ఉదాహరణ అని అనిల్ చౌహాన్ చెప్పారు.
తాజావార్తలు
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!