Puja khedkar: పూజా ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు.. తాజాగా తండ్రిపై ఎఫ్ఐఆర్
- పూజా ఖేదర్ ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు
- తాజాగా తండ్రి దిలీప్ ఖేద్కర్పై ఎఫ్ఐఆర్
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫ్యామిలీని కేసులు కష్టాలు వెంటాడుతున్నాయి. పూజా ఇప్పటికే ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా క్రిమినల్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉంది. వివాదాలు వెంటాడుతున్న సమయలోనే పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ అన్నదాతను తుపాకీతో బెదిరించిన కేసులో జైలుకెళ్లింది. ఇప్పుడు తండ్రి దిలీప్ ఖేద్కర్ వంతు వచ్చింది. పూణె కలెక్టరేట్లో విధి నిర్వహణలో ప్రభుత్వోద్యోగిని బెదిరించి.. పనులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై తహసీల్దార్ స్థాయి అధికారి బండ్గార్డెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో దిలీప్ ఖేద్కర్పై కేసు నమోదైంది. దిలీప్ ఖేద్కర్పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పూజా ఖేద్కర్కు సొంత ప్రాంతం పూణెలో అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ పడింది. ప్రొబేషనరీ సమయంలో రెండేళ్ల పాటు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ పూజా తండ్రి దిలీప్ మాత్రం.. కలెక్టరేట్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అధికారుల్ని బెదిరించి కుమార్తెకు సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై తాజాగా తహసీల్దార్ దీపక్ అకాడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెదిరింపుల సమయంలో దురుసుగా ప్రవర్తించారని.. అంతేకాకుండా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేకపోయినప్పటికీ కూతురికి క్యాబిన్ కేటాయించాలని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆ కేసులో దిలీప్ ఖేద్కర్ ముందస్తు బెయిల్కు అప్లై చేసుకోగా.. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇక ఆయన భార్య మనోరమ ఇటీవలే బెయిల్పై విడుదలైంది. దిలీప్ ఖేద్కర్ గత లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల అఫిడవిట్లో రూ.60 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఇదిలా ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల పూజ ఖేద్కర్ ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి ఆమెను శాశ్వతంగా డిబార్ చేసింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కోసం ఆమె చేసిన దరఖాస్తులో సమాచారాన్ని తప్పుగా సూచించారని ఆరోపణలపై ఢిల్లీలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా ఖేద్కర్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. దుబాయ్ పారిపోయినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. మరోవైపు యూపీఎస్సీ చర్యను సవాల్ చేస్తూ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా తనకు ఎలాంటి కాపీ అందలేదని ఆమె న్యాయస్థానంలో తెలిపింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
-
Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
-
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?