Puja khedkar: పూజా ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు.. తాజాగా తండ్రిపై ఎఫ్ఐఆర్
- పూజా ఖేదర్ ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు
- తాజాగా తండ్రి దిలీప్ ఖేద్కర్పై ఎఫ్ఐఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫ్యామిలీని కేసులు కష్టాలు వెంటాడుతున్నాయి. పూజా ఇప్పటికే ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా క్రిమినల్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉంది. వివాదాలు వెంటాడుతున్న సమయలోనే పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ అన్నదాతను తుపాకీతో బెదిరించిన కేసులో జైలుకెళ్లింది. ఇప్పుడు తండ్రి దిలీప్ ఖేద్కర్ వంతు వచ్చింది. పూణె కలెక్టరేట్లో విధి నిర్వహణలో ప్రభుత్వోద్యోగిని బెదిరించి.. పనులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై తహసీల్దార్ స్థాయి అధికారి బండ్గార్డెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో దిలీప్ ఖేద్కర్పై కేసు నమోదైంది. దిలీప్ ఖేద్కర్పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పూజా ఖేద్కర్కు సొంత ప్రాంతం పూణెలో అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ పడింది. ప్రొబేషనరీ సమయంలో రెండేళ్ల పాటు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ పూజా తండ్రి దిలీప్ మాత్రం.. కలెక్టరేట్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అధికారుల్ని బెదిరించి కుమార్తెకు సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై తాజాగా తహసీల్దార్ దీపక్ అకాడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెదిరింపుల సమయంలో దురుసుగా ప్రవర్తించారని.. అంతేకాకుండా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేకపోయినప్పటికీ కూతురికి క్యాబిన్ కేటాయించాలని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆ కేసులో దిలీప్ ఖేద్కర్ ముందస్తు బెయిల్కు అప్లై చేసుకోగా.. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇక ఆయన భార్య మనోరమ ఇటీవలే బెయిల్పై విడుదలైంది. దిలీప్ ఖేద్కర్ గత లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల అఫిడవిట్లో రూ.60 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ఇదిలా ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల పూజ ఖేద్కర్ ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి ఆమెను శాశ్వతంగా డిబార్ చేసింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కోసం ఆమె చేసిన దరఖాస్తులో సమాచారాన్ని తప్పుగా సూచించారని ఆరోపణలపై ఢిల్లీలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా ఖేద్కర్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. దుబాయ్ పారిపోయినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. మరోవైపు యూపీఎస్సీ చర్యను సవాల్ చేస్తూ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా తనకు ఎలాంటి కాపీ అందలేదని ఆమె న్యాయస్థానంలో తెలిపింది.
తాజావార్తలు
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!