Business Headlines: బంగారం ధరలు మరింత పతనం.. పెరిగిన రైతుల ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Headlines: పెరిగిన జీఎస్టీ రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. లేబుల్ వేసిన ఫుడ్ ఐటమ్స్తోపాటు రూమ్ రెంట్ ఐదు వేల రూపాయలకు పైగా ఉన్న ఆస్పత్రుల బిల్లులపై అదనంగా ఐదు శాతం జీఎస్టీని ఇవాళ్టి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా ప్యాక్ చేసిన గోధుమ పిండి, పనీర్, పెరుగు, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తులకీ ఇది వర్తిస్తుంది.
25-30 శాతం పెరిగిన నియామకాలు
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
వచ్చే నెలలో పండగ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు పాతిక నుంచి 30 శాతం వరకు పెరిగాయి. డిమాండ్కి తగ్గట్లు సర్వీసులను అందించేందుకు ఇ-కామర్స్, కన్జ్యూమర్, రిటైల్, గిఫ్టింగ్ మరియు హాస్పిటాలిటీ సంస్థలు స్టాఫ్ని పెంచుకున్నాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం అనంతరం ఈసారి రిక్రూట్మెంట్లు ఊపందుకోవటం విశేషం.
అమెరికాలో భారీగా నిరుద్యోగ క్లెయిమ్లు
అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. వారం రోజుల్లోనే 9 వేలు పెరగటంతో మొత్తం సంఖ్య 2 లక్షల 44 వేలకు చేరింది. గత వారం సవరించని లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2 లక్షల 35 వేలు మాత్రమే. కాగా ఈ నిరుద్యోగ క్లెయిమ్ల్లో పెరుగుదల 8 నెలల గరిష్టమని కార్మిక విభాగం గణాంకాలు చెబుతున్నాయి.
నాలుగేళ్లలో పెరిగిన రైతుల ఆదాయం
గడచిన నాలుగేళ్లలో రైతుల సగటు ఆదాయం 1 పాయింట్ 3 నుంచి 1 పాయింట్ 7 రెట్ల వరకు పెరిగింది. 2018 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2022 నాటికి ధాన్యం ఎగుమతులు 50 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. దీంతో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 14 పాయింట్ 2 శాతం నుంచి 18 పాయింట్ 8 శాతానికి చేరినట్లు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.
ఇంకా తగ్గుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు మరింత తగ్గుతున్నాయి. డాలర్ బలపడటంతోపాటు అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, అత్యధిక ద్రవ్యోల్బణం తదితర ప్రభావాలు పసిడి మీద పడ్డాయి. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ ఒక శాతానికి పైగా పడిపోయాయి. ఫలితంగా పది గ్రాముల బంగారం ధర 50 వేల 107 రూపాయలు పలికింది. బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు నేల చూపులు చూశాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?