Jodha-Akbar: జోధా-అక్బర్ పెళ్లి నిజం కాదు, బ్రిటీష్ ప్రభావిత భారత చరిత్ర: రాజస్థాన్ గవర్నర్
- జోధా-అక్బర్ పెళ్లి అబద్ధం..
- బ్రిటిష్ వారి ప్రభావంతో భారత చరిత్ర..
- రాజస్థాన్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jodha-Akbar: బ్రిటీష్ చరిత్రకారుల ప్రభావం కారణంగా భారతదేశ చరిత్రలో అనేక తప్పులు నమోదయ్యాయని రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బగాడే అన్నారు. బుధవారం, ఉదయ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..జోధాబాయి, మొఘల్ పాలకుడు అక్బర్ చక్రవర్తి వివాహం వివాహం కూడా అబద్ధమే అని అన్నారు. అక్బర్నామా గ్రంథంలో ఎక్కడా కూడా వీరిద్దరికి పెళ్లి జరిగినట్లు ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
“జోధా మరియు అక్బర్ వివాహం చేసుకున్నారని, ఈ కథపై ఒక సినిమా కూడా తీశారని చెబుతారు. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే చెబుతున్నాయి కానీ అది అబద్ధం” అని గవర్నర్ అన్నారు. భర్మల్ అనే రాజు ఉండేవారని, ఆయన తన పనిమనిషి కుమార్తెను అక్బర్తో వివాహం చేయించారని పేర్కొన్నారు. గవర్నర్ వ్యాఖ్యలతో 1569లో అమేర్ పాలకుడు భర్మల్ కుమార్తె జోధాబాయి, అక్బర్ మధ్య వివాహంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. అమెర్ లేదా అంబర్, ప్రస్తుతం జైపూర్ సమీపంలోని రాజ్పుత్ రాజ్యం. 1727లో సవాయి జై సింగ్-2 రాజధానిని జైపూర్కి మార్చడానికి ముందు కచ్వాహా రాజ్పుత్లో పాలించబడింది.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
Read Also: Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
“బ్రిటిష్ వారు మన హీరోల చరిత్రను మార్చారు. వారు దానిని సరిగ్గా వ్రాయలేదు, వారి చరిత్ర వెర్షన్ మొదట్లో అంగీకరించబడింది. తరువాత, కొంతమంది భారతీయులు చరిత్ర రాశారు, కానీ అది ఇప్పటికీ బ్రిటిష్ వారిచే ప్రభావితమైంది” అని గవర్నర్ బగాడే అన్నారు. రాజ్పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్ అక్బర్కి ఒక ఒప్పంద లేఖ రాశాడనే చరిత్రకారుల వాదనను కూడా ఆయన వ్యతిరేకించారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే కథనం అన్నారు.
“మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవంతో ఎప్పుడూ రాజీపడలేదు. చరిత్రలో ఎక్కువగా అక్బర్ గురించి బోధించారు. మహారాణా ప్రతాప్ గురించి తక్కువగా చెప్పారు” అని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతోందని, కొత్త జాతీయ విద్యా విధానంలో మన మన సంస్కృతిని, అద్భుతమైన చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్తు సవాళ్లకు కొత్త తరాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గవర్నర్ అన్నారు. రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ మహరాజ్ లను దేశభక్తి చిహ్నాలుగా గవర్నర్ బగాడే ప్రశంసించారు.
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..