Jodha-Akbar: జోధా-అక్బర్ పెళ్లి నిజం కాదు, బ్రిటీష్ ప్రభావిత భారత చరిత్ర: రాజస్థాన్ గవర్నర్
- జోధా-అక్బర్ పెళ్లి అబద్ధం..
- బ్రిటిష్ వారి ప్రభావంతో భారత చరిత్ర..
- రాజస్థాన్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jodha-Akbar: బ్రిటీష్ చరిత్రకారుల ప్రభావం కారణంగా భారతదేశ చరిత్రలో అనేక తప్పులు నమోదయ్యాయని రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బగాడే అన్నారు. బుధవారం, ఉదయ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..జోధాబాయి, మొఘల్ పాలకుడు అక్బర్ చక్రవర్తి వివాహం వివాహం కూడా అబద్ధమే అని అన్నారు. అక్బర్నామా గ్రంథంలో ఎక్కడా కూడా వీరిద్దరికి పెళ్లి జరిగినట్లు ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
“జోధా మరియు అక్బర్ వివాహం చేసుకున్నారని, ఈ కథపై ఒక సినిమా కూడా తీశారని చెబుతారు. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే చెబుతున్నాయి కానీ అది అబద్ధం” అని గవర్నర్ అన్నారు. భర్మల్ అనే రాజు ఉండేవారని, ఆయన తన పనిమనిషి కుమార్తెను అక్బర్తో వివాహం చేయించారని పేర్కొన్నారు. గవర్నర్ వ్యాఖ్యలతో 1569లో అమేర్ పాలకుడు భర్మల్ కుమార్తె జోధాబాయి, అక్బర్ మధ్య వివాహంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. అమెర్ లేదా అంబర్, ప్రస్తుతం జైపూర్ సమీపంలోని రాజ్పుత్ రాజ్యం. 1727లో సవాయి జై సింగ్-2 రాజధానిని జైపూర్కి మార్చడానికి ముందు కచ్వాహా రాజ్పుత్లో పాలించబడింది.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
“బ్రిటిష్ వారు మన హీరోల చరిత్రను మార్చారు. వారు దానిని సరిగ్గా వ్రాయలేదు, వారి చరిత్ర వెర్షన్ మొదట్లో అంగీకరించబడింది. తరువాత, కొంతమంది భారతీయులు చరిత్ర రాశారు, కానీ అది ఇప్పటికీ బ్రిటిష్ వారిచే ప్రభావితమైంది” అని గవర్నర్ బగాడే అన్నారు. రాజ్పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్ అక్బర్కి ఒక ఒప్పంద లేఖ రాశాడనే చరిత్రకారుల వాదనను కూడా ఆయన వ్యతిరేకించారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే కథనం అన్నారు.
“మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవంతో ఎప్పుడూ రాజీపడలేదు. చరిత్రలో ఎక్కువగా అక్బర్ గురించి బోధించారు. మహారాణా ప్రతాప్ గురించి తక్కువగా చెప్పారు” అని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతోందని, కొత్త జాతీయ విద్యా విధానంలో మన మన సంస్కృతిని, అద్భుతమైన చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్తు సవాళ్లకు కొత్త తరాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గవర్నర్ అన్నారు. రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ మహరాజ్ లను దేశభక్తి చిహ్నాలుగా గవర్నర్ బగాడే ప్రశంసించారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!