NTV Telugu Site icon

దారుణం: రెండో ఎక్కం చెప్పలేదని… పెళ్ళికి నిరాకరించిన వధువు  

రెండో ఎక్కం  ఓ వరుడికి తిప్పలు తెచ్చిపెట్టింది.  రెండో ఎక్కం చెప్పడం రాలేదని చెప్పి వధువు పెళ్లి క్యాన్సిన్ చేసుకుంది.  ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.  ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాకు చెందిన రంజిత్ మహిల్వార్ అనే వ్యక్తికీ వివాహం నిశ్చయమైంది.  వివాహం రోజున వరుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు ఆ వ్యక్తిని రెండో ఎక్కం చెప్పమని కోరారు.  అయితే, వరుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.  సైలెంట్ గా ఉండిపోయాడు.  దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు వివాహాన్ని రద్దు చేసుకుంది.  పెళ్లి అయిన ఖర్చు మొత్తాన్ని వరుడు చెల్లించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.