Site icon NTV Telugu

Assam Boat Capsize: విద్యార్థులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా.. లభించని విద్యార్థుల ఆచూకీ

Assam Boat Capsize

Assam Boat Capsize

Assam Boat Capsize: అసోంలోని ధుబ్రి జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ బ్రహ్మపుత్ర నదిలో పలువురు ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు, పలువురు గల్లంతయ్యారు. పడవలో దాదాపు 100 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, 10 మోటార్ సైకిళ్లను అందులో ఎక్కించారని స్థానికులు పేర్కొన్నారు. దీని బరువుకు అది మునిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధుబ్రి పట్టణానికి 3 కి.మీ దూరంలో ఉన్న అడబారి వద్ద బ్రిడ్జి పోస్ట్‌ను ఢీకొని భాషాని వెళ్తున్న పడవ బోల్తా పడిందని, ఇప్పటి వరకు 15 మందిని రక్షించినట్లు అధికారి తెలిపారు.

చాలా మంది పాఠశాల పిల్లలు బోటులో ఉన్నారని, ఇప్పటివరకు ఎవరూ రక్షించలేదని ఆయన చెప్పారు. ధుబ్రీ సర్కిల్ అధికారి సంజు దాస్, ల్యాండ్ రికార్డ్ అధికారి, కార్యాలయ సిబ్బంది కూడా కోతకు గురైన ప్రాంతాన్ని సర్వే చేయడానికి పడవలో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. మిస్టర్ దాస్ తప్పిపోయారు, మిగిలిన ఇద్దరు సురక్షితంగా ఈదుకుంటూ వచ్చారని అధికారులు వెల్లడించారు. స్థానికులు కంట్రీ బోట్‌లతో సహాయక చర్యలు చేపట్టారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) నుండి డైవర్లను కూడా మోహరించినట్లు గౌహతిలోని మరో అధికారి తెలిపారు. త్వరలో గల్లంతైన వారిని రక్షిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Minister Roja: కృష్ణంరాజు కుటుంబసభ్యుల్ని పరామర్శించిన మంత్రి రోజా

Exit mobile version