BJP: సీజేఐ ఇంట్లో “గణపతి పూజ”కు పీఎం మోడీ.. విమర్శలకు “ఇఫ్తార్ విందు”తో బీజేపీ సమాధానం..
- సీజేఐ ఇంటిలో గణపతి పూజకి ప్రధాని మోడీ..
- రాజకీయ విమర్శలకు దారి తీసిన ఘటన..
- ఇఫ్తాన్ విందులో బీజేపీ సమాధానం..
- మన్మోహన్ సింగ్ నిర్వహించిన కార్యక్రమానికి అప్పటి సీజేఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గణపతి పూజ సందర్భంగా మోడీ, చంద్రచూడ్ ఇంటికి వెళ్లారు. గణపతి పూజలో సీజేఐ దంపతులతో కలిసి ఉన్న ఫోటోని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఆర్జేడీ వంటి ఇండియా కూటమి నేతలు ప్రధాని వెళ్లడాన్ని తప్పుపడుతున్నాయి.
Read Also: Sangareddy: కూల్డ్రింక్లో మద్యం కలిపి బాలికపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ఇదిలా ఉంటే, బీజేపీ కూడా అంతే ధీటుగా ఇండియా కూటమి నేతలకు బదులిస్తోంది. ‘‘గణపతి పూజ’’ విమర్శలకు ‘‘ఇఫ్తార్ విందు’’తో సమాధానం ఇచ్చింది. ప్రతిపక్షాలు ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’గా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. 2009లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన నివాసంలో ఇఫ్తార్ పార్టీకి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరైన విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. ఆనాటి ఫోటోలను పంచుకున్నారు.
‘‘2009లో పీఎం మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ పార్టీకి అప్పటి సీజేఐ కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారు..ష్ష్- ఇది సెక్యులరిజం.. న్యాయవ్యవస్థ సురక్షితం. పీఏ మోడీ ప్రస్తుతం సీజేఐ ఇంట్లో గణపతి పూజకు హాజరయ్యారు. ఓ మై గాడ్ ఇది న్యాయవ్యవస్థ కాంప్రమైజ్ అయింది’’ అని పూనావాలా వ్యంగ్యంగా ట్వీట్ చేసి, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. 2009లో న్యూఢిల్లీలో ప్రధానిమంత్రి నివాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దీనికి మన్మోహన్ సింగ్తో పాటు ఆయన భార్య గురుశరణ్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు అప్పటి బీజేపీ చీఫ్ లాల్ కృష్ణ అద్వానీ, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, రాష్ట్రీయ జనతాదళ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!